Mallikarjun Kharge : బొమ్మై కామెంట్స్ ఖర్గే సీరియస్
పార్టీ చీఫ్ ఇప్పటికే స్పష్టం చేశారు
Mallikarjun Kharge : ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే సీరియస్ గా స్పందించారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది. ఇందులో రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే భారతీయ జనతా పార్టీ అనుబంధ సంస్థ భజరంగ్ దళ్ తో పాటు ఇస్లాం ఉగ్రవాద సంస్థను నిషేధం విధిస్తామని ప్రకటించింది. దీనిపై బీజేపీ నిప్పులు చెరిగింది. ఎంపీ తేజస్వి సూర్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపై దమ్ముంటే తాను భజరంగినని తనను నిషేధించాలంటూ కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసిరారు.
దీనిపై తీవ్ర రాద్దాంతం చోటు చేసుకుంది. కర్ణాటక సీఎం బస్వరాజ్ బొమ్మై సంచలన కామెంట్స్ చేశారు. భజరంగ్ దళ్ తో పెట్టుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. దీనిపై ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge) స్పందించారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడిన ఆయన ఇదంతా పార్టీ చూసుకుంటుందన్నారు. ఇప్పటికే తమ పార్టీ ఇంఛార్జ్ డాక్టర్ పరమేశ్వర స్పష్టం చేశారని తెలిపారు. తాను ఇకపై మాట్లాడదల్చు కోలేదన్నారు.
బొమ్మై అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం తనకు లేదన్నారు మల్లికార్జున్ ఖర్గే. డాక్టర పరమేశ్వర డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా ఉన్నారు. దీనిపై పూర్తి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎన్నికల వేళ బీజేపీ రాజకీయాలు చేయాలని చూస్తోందని ధ్వజమెత్తారు ఖర్గే.
Also Read : బేటీ బచావో అనేది ఓ వంచన – రాహుల్