Maoist Encounter : ఆపరేషన్ కగార్ లో సమర్థవంతంగా పనిచేసిన పోలీసు సిబ్బందికి శుభవార్త
మావోయిస్టులకు కేరాఫ్ ఆడ్రస్గా ఉన్నా....
Maoist Encounter : పోలీస్ సిబ్బందికి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మావోయిస్టుల అణచివేతలో సమర్థవంతంగా పని చేసిన పోలీసులకు పదోన్నతలు కల్పిస్తున్నట్లు ప్రకటించింది. దాదాపు 295 మందికి ఆ రాష్ట్ర పోలీస్ శాఖ పదోన్నతి కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించిన పదోన్నతులు జాబితాను ఛత్తీస్గఢ్(Chhattisgarh) డీజీపీ అరుణ్ గౌతమ్ శుక్రవారం రాయ్పూర్లో విడుదల చేశారు. రిజర్వ్ ఫోర్స్ నుంచి డీఎస్పీ వరకు అన్ని విభాగాల అధికారులకు ఈ పదోన్నతలు కల్పించినట్లు జారీ చేసిన ఆదేశాల్లో స్పష్టం చేశారు. మావోయిస్టులకు కేరాఫ్ ఆడ్రస్గా ఉన్నా.. బస్తర్లో విధులు నిర్వహించిన వారికి ఈ పదోన్నతులు కల్పించారు.
Maoist Encounter Updates
2026, మార్చి మాసం చివరి నాటికి దేశంలో మావోయిస్టులు లేకుండా చేయాలనే లక్ష్యంతో కేంద్రం ప్రభుత్వం పక్కా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. అందులోభాగంగా ఆపరేషన్ కగార్ చేపట్టింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో దాదాపుగా మావోయిస్టులు తుచుకు పెట్టుకుపోయారు. కానీ ఛత్తీస్గఢ్లో మాత్రం వారి ప్రాబల్యం అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో దండకారణ్యంలో పోలీసులతోపాటు భద్రతా బలగాలు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఆ క్రమంలో పలు ఎన్కౌంటర్లు చోటు చేసుకున్నాయి. వీటిలో వందలాది మంది మావోయిస్టులు మృతి చెందారు.
మరికొంత మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోతే.. ఇంకొంతమందిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న దండకారణ్యంలో దాదాపుగా పోలీసులు జల్లెడ పట్టేశారు. మరికొద్ది రోజుల్లో ఈ ప్రాంతాన్ని ఛత్తీస్గగఢ్ పోలీసులు స్వాధీనం చేసుకోనున్నారు. మరోవైపు మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు ఇటీవల ఎన్కౌంటర్లో మరణించారు. ఈ ఎన్కౌంటర్పై ప్రధాని మోదీ సైతం స్పందించిన సంగతి తెలిసిందే.
Also Read : Bhanuprakash Reddy Slams : మాజీ సీఎం వైఎస్ జగన్ పై భగ్గుమన్న అప్ బీజేపీ కీలక నేత