Mayank Agarwal : ఈ విజ‌యం వాళ్ల‌కే అంకితం 

పీఎన్బీ స్కిప్ప‌ర్ మ‌యాంక్ 

Mayank Agarwal  : ఐపీఎల్ 2022లో రిచ్ లీగ్ లో భాగంగా జ‌రిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసింది. ముంబై ఇండియ‌న్స్ తో జ‌రిగిన మ్యాచ్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.

ఐపీఎల్ లో ప్ర‌తి పాయింట్ అత్యంత ముఖ్య‌మ‌ని పేర్కొన్నాడు పంజాబ్ కింగ్స్ కెప్టెన్ మ‌యాంక్ అగ‌ర్వాల్(Mayank Agarwal ). ముంబై వేదిక‌గా జ‌రిగిన ఉత్కంఠ భ‌రిత పోరులో ఊహించ‌ని రీతిలో గెలుపొందింది.

స‌క్సెస్ లో బౌల‌ర్లు, బ్యాట‌ర్లు కీల‌క పాత్ర పోషించారంటూ కితాబు ఇచ్చారు. ఇరు జ‌ట్లు మ్యాచ్ ప‌రంగా 200కు పైగా ప‌రుగులు చేయ‌డం విస్తు పోయేలా చేసింద‌న్నాడు.

ఇంకో 20 ప‌రుగులు చేసి ఉంటే కూడా తాము టార్గెట్ ఛేదించి ఉండేవాళ్ల‌మ‌ని పేర్కొన్నాడు మ‌యాంక్ అగ‌ర్వాల్(Mayank Agarwal ).విరాట్ కోహ్లీ, డుప్లెసిస్ పూర్తిగా మ్యాచ్ ను త‌మ వైపు తిప్పుకునేలా చేశాడ‌ని కితాబు ఇచ్చాడు.

రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు అద్భుతంగా ఆడిందంటూ ప్ర‌శంసించాడు. ఇదిలా ఉండ‌గా ముంబై ఇండియ‌న్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 205 ప‌రుగులు చేసింది రెండు వికెట్లు కోల్పోయి. ఊహించ‌ని రీతిలో పంజాబ్ కింగ్స్ దుమ్ము రేపింది.

భారీ టార్గెట్ ను ఛేదించింది. డుప్లెసిస్ 88 ర‌న్స్ చేస్తే కోహ్లీ 50 ప‌రుగులు చేశాడు. కొండంత ల‌క్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ 19 ఓవ‌ర్ల‌లోనే 208 ర‌న్స్ చేసింది. మ‌యాంక్ 32 చేస్తే ధావ‌న్ 43 , రాజ‌ప‌క్స్ 43  ప‌రుగులు చేశారు.

ఇదిలా ఉండ‌గా మ్యాచ్ ను మ‌లుపు తిప్ప‌డంలో కీల‌క పాత్ర పోషించిన ఓడెన్ స్మిత్ ను ఆకాశానికి ఎత్తేశాడు పంజాబ్ కింగ్స్ స్కిప్ప‌ర్ మ‌యాంక్ అగ‌ర్వాల్.

Also Read : రెచ్చి పోయిన డుప్లెసిస్..కోహ్లీ

Leave A Reply

Your Email Id will not be published!