Minister Anam : గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి మరుగున పడింది

గత పదేళ్లుగా మేకపాటి కుటుంబం నిర్లక్ష్యంతో ఆత్మకూరు మున్సిపాలిటీ అభివృద్ధి జరగలేదని విమర్శించారు...

Minister Anam : ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్‌లోని జలాశయాలు నిండు కుండలా మారాయని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఆదివారం నాడు ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ.. నదుల అనుసంధానం జరిగితే మెట్ట ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. సోమశిల జలాశయం ఆపరాన్ పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతామని అన్నారు.

Minister Anam Comment

గత పదేళ్లుగా మేకపాటి కుటుంబం నిర్లక్ష్యంతో ఆత్మకూరు మున్సిపాలిటీ అభివృద్ధి జరగలేదని విమర్శించారు. ఎన్డీఏ ప్రభుత్వంలో ఆత్మకూరు మున్సిపాలిటీ అభివృద్ధికి రూ. 12.80 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. ఆత్మకూరులో బీసీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల మంజూరు‌ చేశామని అన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచే క్లాసులు ప్రారంభిస్తామని వెల్లడించారు. ఆత్మకూరు మున్సిపాలిటీకి పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు.

Also Read : Minister Atchannaidu : నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటాం ఎవ్వరూ భయపడొద్దు

Leave A Reply

Your Email Id will not be published!