Minister Kandula Durgesh : ఆంధ్రప్రదేశ్ లో హెల్త్ టూరిజం ని అభివృద్ధి చేయాల్సి ఉంది

Minister Kandula : నారాయణగిరి పార్కులో ఏపీ టూరిజం ఏర్పాటు చేసిన హోటల్‌ను మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. టీటీడీ నిర్ణయించిన ధరల ప్రకారం భక్తులకు నాణ్యమైన ఆహారాన్ని అందుబాటు ధరల్లో అందిస్తామన్నారు. తిరుమలలో ఇప్పటికే మూడు హోటళ్లను నడుపుతున్నారు. టూరిజం శాఖ సహకారంతో రాష్ట్రంలో ఇలాంటి హోటళ్లను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తిరుపతిలోని 30 ఎకరాల టూరిజం శాఖ స్థలంలో కూడా త్వరలో అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని కందుల దుర్గేష్ వెల్లడించారు. గత ప్రభుత్వం పర్యాటక రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు.

Minister Kandula Comment

పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా రాష్ట్ర ఆదాయం కూడా పెరుగుతుందని కందుల దర్ఘేష్(Kandula Durgesh) అన్నారు. రాష్ట్రంలో ఎకో, టెంపుల్, హెరిటేజ్, హెల్త్ టూరిజం అభివృద్ధి చేస్తామన్నారు. చిన్న తరహా అభివృద్ధి ద్వారా పర్యాటక రంగ ఆదాయాన్ని పెంచుకోవచ్చని చెప్పారు. కేంద్రం కూడా పర్యాటక రంగ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. రాష్ట్ర పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్రం కూడా రాష్ట్రానికి నిధులు వెచ్చించవచ్చని చెప్పారు. టూరిజం శాఖల ద్వారా వచ్చే భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని తెలిపారు. సమస్యను ఈఓ దృష్టికి తీసుకెళ్లి టూరిజం ద్వారా వచ్చే భక్తులకు సత్వర దర్శనం కల్పించేలా చూడాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యాటక శాఖల్లో చేపడుతున్న అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించి త్వరితగతిన పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.

Also Read : TTD Updates : తిరుమల అన్న ప్రసాదం మార్పులు చేర్పులపై కీలక అంశాలు

Leave A Reply

Your Email Id will not be published!