Minister Kishan Reddy : కాళేశ్వరం కమిషన్ ఎదుట ఈటల ఇచ్చిన వివరణతో బీజేపీకి సంబంధం లేదు
ఈటలతో కమిషన్ బీజేపీ వైఖరి ఏమిటని అడగలేదని ఆయన వివరించారు...
Kishan Reddy : కాళేశ్వరం కమిషన్ ఎదుట ఎంపీ ఈటల రాజేందర్ ఇచ్చిన వివరణ బీజేపీ అభిప్రాయాన్ని సూచించదని కేంద్ర మంత్రి జి. కిషన్రెడ్డి స్పష్టం చేశారు. ఈటలతో కమిషన్ బీజేపీ వైఖరి ఏమిటని అడగలేదని ఆయన వివరించారు.
Union Minister Kishan Reddy Comments
‘‘ఈటల చెప్పింది ఆయన వ్యక్తిగతంగా, బీజేపీ తరపున కాదు. ఆయన బీజేపీ ఎంపీగా కాదు, బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో ఏం జరిగిందో అది మాత్రమే చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై తనకు తెలిసిన విషయాలను కమిషన్ ఎదుట వివరించారు. తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా విచారణకు వెళ్లారు,’’ అని కిషన్రెడ్డి తెలిపారు.
మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లకు పగుళ్లు వచ్చాయా లేదా అన్నదానిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై బీజేపీ చేసిన ఆరోపణలపై పార్టీ స్థిరంగా ఉన్నదని అన్నారు. తాము కూడా కమిషన్ను కలసి తమ వైఖరిని స్పష్టంగా తెలియజేస్తామని చెప్పారు.
కేసీఆర్కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రజల ముందు వచ్చి ప్రాజెక్టు ఎంతవరకు ఉపయోగపడిందో వివరించాలని కిషన్రెడ్డి సవాల్ చేశారు.
Also Read : MLA Maganti Gopinath : జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ‘మాగంటి గోపినాథ్’ మృతి