Minister Rajnath Singh : ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి రాజ్ నాథ్ సింగ్ పాక్ కు మాస్ వార్నింగ్
రాజ్నాథ్ సింగ్ శుక్రవారం ఐఎన్ఎస్ విక్రాంత్ను సందర్శించారు...
Rajnath Singh : భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాకిస్థాన్కు మాస్ వార్నింగ్ ఇచ్చారు. పాకిస్థాన్తో యుద్ధం జరిగినపుడు భారత నేవీ గనుక రంగలోకి దిగి ఉంటే.. పాకిస్థాన్ నాలుగు ముక్కలయి ఉండేదని అన్నారు. యుద్దం సమయంలో భారత నేవీ మౌనంగా ఉంటూనే.. శత్రువుల గుండెల్లో దడ పుట్టించిందని అన్నారు. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా నేవీ పాత్రను ఆయన కొనియాడారు. రాజ్నాథ్ సింగ్(Rajnath Singh) శుక్రవారం ఐఎన్ఎస్ విక్రాంత్ను సందర్శించారు. ఐఎన్ఎస్ విక్రాంత్పై నిలబడి పాకిస్థాన్కు వార్నింగ్ ఇచ్చారు.
Minister Rajnath Singh Slams
ఆయన మాట్లాడుతూ.. ‘ 1971లో భారత్, పాకిస్థాన్ల మధ్య యుద్ధం జరిగినపుడు భారత నేవీ కూడా యుద్ధంలో పాల్గొంది. భారత నేవీ దెబ్బకు పాక్ రెండుగా చీలిపోయింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత నేవీ రంగంలోకి దిగి ఉంటే.. ఈ సారి పాక్ నాలుగు ముక్కలు అయ్యేది. ఆపరేషన్ సిందూర్ సమయంలో నేవీ మౌనంగా తన పని చేసుకుపోయింది. ప్రతీ భారతీయుడ్ని ఆశ్చర్యపరిచింది. మౌనంగా ఉంటూనే .. పాక్ ఆర్మీని ఓడించటంలో విజయవంతం అయింది. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా ఎయిర్ఫోర్స్ పాక్ టెర్రర్ బేస్లను ధ్వంసం చేసింది.
అప్పుడు భారత నేవీ బలగాలు ఎంతో దూకుడుగా అరేబియా మహా సముద్రంలో మోహరించాయి. పాక్ నేవీ.. నీటి సరిహద్దులు దాటి ఇటువైపు రావడానికి ధైర్యం చేయలేకపోయింది. పాకిస్థాన్ చాలా అదృష్టం చేసుకుంది. ఒక వేళ ఆపరేషన్ సిందూర్ సమయంలో నేవీ రంగంలోకి దిగిఉంటే పాక్ పరిస్థితి దారుణంగా ఉండేది. ఇప్పటి వరకు జరిగిందంతా వామ్ అప్ మాత్రమే. ఈ సారి పాకిస్థాన్ యుద్ధానికి దిగితే.. నేవీ కూడా రంగంలోకి దిగుతుంది. అప్పుడు పాక్ పరిస్థితి ఏమవుతుందో ఆ దేవుడికే తెలియాలి’ అని అన్నారు.
Also Read : PM Narendra Modi : పాక్ పై మరోసారి నిప్పులు చెరిగిన ప్రధాని మోదీ