Minister Ramanaidu : పోలవరం పనులు జరగడం చూసి వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుంది

బట్రస్ డ్యామ్ పనులు పూర్తి కావొచ్చాయని అన్నారు...

Minister Ramanaidu : పోలవరం ప్రాజెక్ట్ నాణ్యత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్ట్ పనులు షెడ్యూల్ ప్రకారమే జరుగుతున్నాయని అన్నారు. డీ వాల్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. గత జగన్ ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టు తమకు అర్థం కాలేదని, ఎప్పటికీ పూర్తవుతుందో చెప్పలేమని నాటి వైసీపీ మంత్రులు అన్నారని గుర్తుచేశారు మంత్రి రామానాయుడు.

Minister Ramanaidu Slams YCP

ఇవాళ(మంగళవారం)పోలవరం ప్రాజెక్టు పనులను మంత్రి నిమ్మల రామానాయుడు(Minister Ramanaidu) పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడారు. వర్షాకాలంలో కూడా పనులు చేసేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. బట్రస్ డ్యామ్ పనులు పూర్తి కావొచ్చాయని అన్నారు. ఇప్పటికే పోలవరం హెడ్ వర్క్స్ 80 శాతానికి పైగా పూర్తయ్యాయని వివరించారు. పోలవరం పనులు వేగంగా జరుగుతుంటే ఓర్వలేకే వైసీపీ మీడియా అసత్య కథనాలు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు మంత్రి నిమ్మల రామానాయుడు.

మీడియా సమక్షంలో ప్యానల్ వెడల్పును 1.5 మీటర్లు ఉంది అంటూ, కళ్లకు కొట్టొచ్చినట్లు బావర్ ప్రతినిధులు కొలిచి చూపించారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. డీ వాల్‌ను 1.5 మీటర్ల మందంతోనే నిర్మిస్తుంటే ప్రజలను వైసీపీ నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రాజెక్ట్ పనులను జర్మనీకి చెందిన ఎక్స్‌పర్ట్ బావర్ కంపెనీతో మేఘా కంపెనీ పనులు చేయిస్తుంటే దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read : MP Purandeswari : మోదీ పాలనపై ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి ప్రశంసలు

Leave A Reply

Your Email Id will not be published!