Minister Savitha : మాజీ సీఎం జగన్ ను ఖబడ్దార్ అంటూ హెచ్చరించిన మంత్రి సవిత
మీకు చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత లేదు’ అని హెచ్చరించారు...
Minister Savitha : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత జగన్కు లేదంటూ ఫైర్ అయ్యారు. మంత్రి సవిత(Minister Savitha) మాట్లాడుతూ.. జగన్ ఒక రంగుల రెడ్డి అని.. ఆయనవి చీప్ పాలిటిక్స్ అంటూ విరుచుకుపడ్డారు. తల్లిని, చెల్లిని మోసం చేసింది జగన్ అని వ్యాఖ్యలు చేశారు. గతంలో ఏపీని గంజాయి రాష్ట్రంగా మార్చారని.. గత 5 ఏళ్లలో దళితులపై దాడులు ఎలా చేశారో చూశామన్నారు. జగన్ రౌడీ షీటర్లను పరామర్శించడం అంటే అరాచకాలను ప్రోత్సహించడమే అని అన్నారు. ‘జగన్ ఖబడ్దార్.. మీకు చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత లేదు’ అని హెచ్చరించారు.
Minister Savitha Slams YS Jagan
అన్నమయ్య జిల్లాలో డ్యాం కొట్టుకుపోయి 42 మంది చనిపోతే ఎందుకు పరామర్శించ లేదని ప్రశ్నించారు. తల్లికి, చెల్లికి వెన్నుపోటు పొడిచింది జగన్(YS Jagan) కాదా అని ప్రశ్నించారు. ప్రజలు ఎందుకు బుద్ధి చెప్పారో ఇప్పటికైనా తెలుసుకోవాలని హితవుపలికారు. వైఎస్ వివేకాను చంపితే వాళ్ళకు ఎందుకు న్యాయం చేయలేదని నిలదీశారు. ఎన్నికల హామీలు ఎన్ని అమలు చేశారో చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. రైతులను జగన్ ఎలా మోసం చేశారో తెలుసన్నారు. పింఛన్ను రూ. 3 వేల నుంచి రూ. 4 వేలకు ఒకేసారి పెంచామని.. దేశంలో ఇంత పెద్ద ఎత్తున పింఛన్ ఇచ్చే ప్రభుత్వం ఎక్కడ ఉందో చూపించు అంటూ జగన్కు సవాల్ విసిరారు. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు.
‘జగన్ నీ భూ చట్టాలను రద్దు చేశాం. నీ హయంలో ఎన్ని లక్షల ఎకరాలు అక్రమాలు చేశారో.. ఇప్పుడు బయటికి వస్తున్నాయి’ అని తెలిపారు. రాయలసీమను అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు అని చెప్పుకొచ్చారు. కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం ప్రారంభం కానుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లు ధ్వంసం చేశారని మండిపడ్డారు. అమ్మ ఒడి పథకం ద్వారా ఎంత మందికి ఇచ్చావు జగన్ అంటూ ప్రశ్నించారు. తాము తల్లికి వందనం కింద ఎంత మంది పిల్లలు ఉన్నా రూ.15 వేలు ఇస్తున్నామని తెలిపారు. ల్యాండ్, వైన్, మైన్లో అక్రమాలు చేశారంటూ మంత్రి సవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Also Read : Operation Sindoor : ఆపరేషన్ సింధూర్ లో నష్టం కాదు లక్ష్యం చూడాలి-డిఫెన్స్ స్టాఫ్ జనరల్