Minister Seethakka : నడిగడ్డ తండాలో హత్యకు గురైన బాధిత కుటుంబాన్ని పరామర్శించిన సీతక్క

దీంతో తాజాగా మంత్రి సీతక్క బాధితుల స్వగ్రామానికి వెళ్లి వారిని పరామర్శించారు...

Minister Seethakka : హైదరాబాద్ నడిగడ్డతండాలో హత్యాచారానికి గురైన బాలిక కుటుంబాన్ని మంత్రి సీతక్క పరామర్శించారు. మరిపెడ మండలం ఎల్లంపేటలోని బాధిత గిరిజన కుటుంబాన్ని మంత్రి సీతక్క స్వయంగా వెళ్లి ఓదార్చారు. జూన్ 7న మియాపూర్ నడిగడ్డతండాలో బాలికపై హత్యాచారం ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించడం, దీనిపై సీఎం రేవంత్ రెడ్డి సైతం తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే.

Minister Seethakka Visited

దీంతో తాజాగా మంత్రి సీతక్క బాధితుల స్వగ్రామానికి వెళ్లి వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ..” బాలికలు, మహిళలపై అత్యాచారాలు, హత్యలకు గంజాయి, డ్రగ్స్ వంటి మత్తుపదార్థాలే ప్రధాన కారణం. తెలంగాణలో గంజాయి, డ్రగ్స్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఉక్కుపాదం మోపుతున్నారు. అత్యాచారాలు, హత్యాచారాలకు పాల్పడే నిందితులు ఎవరైనా, ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదు. ఈ విషయంలో పోలీసులకు సీఎం పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. బాలిక కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుంది. వారికి ప్రభుత్వం తరఫున అందాల్సిన లబ్ధిని అందిస్తాం” అని చెప్పారు.

Also Read : AP Finance Minister : గత 5 ఏళ్లలో వైసీపీ సర్కార్ ఏం చేసిందో అన్ని లెక్కలు చూస్తాం

Leave A Reply

Your Email Id will not be published!