MLA Arani Srinivasulu : వైసీపీకి మరో షాక్..పార్టీకి రాజీనామా చేసిన చిత్తూరు ఎమ్మెల్యే

ఒక్క కార్పొరేట్‌ పదవి కూడా తమ వర్గానికి ఇవ్వలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు

MLA Arani Srinivasulu : వైసీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు సొంత పార్టీ నేతలే వరుస షాక్‌లు ఇస్తున్నారు. తాజాగా చిత్తూరు ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు పార్టీకి రాజీనామా చేశారు. వైసీపీకి రాజీనామా చేసి సీఎం జగన్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్‌కు పంపారు. చిత్తూరును అభివృద్ధి చేసే అవకాశాన్ని సీఎం జగన్‌ నిరాకరించారని ఆరోపించారు. ఎమ్మెల్యేగా ప్రజల సమస్యలు పరిష్కరించలేని పరిస్థితి కల్పించారని విమర్శించారు.

MLA Arani Srinivasulu Resign

ఒక్క కార్పొరేట్‌ పదవి కూడా తమ వర్గానికి ఇవ్వలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని అవమానాలు ఎదురైనా వైసీపీ కోసం అంకితభావంతో పనిచేశానన్నారు. ఎమ్మెల్యే టిక్కెట్ తనకే ఇవ్వాలని భావించి ఇవ్వలేదన్నారు. రాజ్యసభలో టికెట్ ఇస్తానని ఇచ్చిన హామీని తుంగలో తొక్కారని జగన్ పై మండిపడ్డారు. ఎట్టకేలకు ఏపీఐసీసీ చైర్మన్ పదవిని కూడా ఆశ చూపించి నిరాశపరిచారని ఆగ్రహం వ్యక్తం చేసారు. తన నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులకు ఇప్పటి వరకు బిల్లులు రాలేదని శ్రీనివాస్‌(MLA Arani Srinivasulu) తెలిపారు. 74 లక్షల విలువైన బిల్లులు బకాయిలు ఉన్నాయని చెప్పారు.

చిరంజీవి కుటుంబంతో తనకు 2002 నుంచి అవినాభావ సంబంధం ఉందని.. తాను పవన్ కళ్యాణ్‌ను కలిశారని అరని శ్రీనివాసులు పార్టీ నుంచి సస్పెండ్ చేశారని తెలిపారు. బలిజలు అంటే జగన్ కు ద్వేషం అని శ్రీనివాస్ పేర్కొన్నారు. ఇమడలేక వైసీపీకి బదులు జనసేన పార్టీలో చేరనున్నట్లు శ్రీనివాస్ ప్రకటించారు. గురువారం అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరనున్నట్లు తెలిపారు.

Also Read : AP News : ఇంద్రకులాద్రిపై దర్శనం ఇప్పించాలంటూ ప్రత్యక్షమైన నకిలీ ఇన్ కమ్ టాక్స్ అధికారి..

Leave A Reply

Your Email Id will not be published!