MLA Harish Rao Slams : మంత్రి ఉత్తమ్ కుమార్ మాట్లాడేవి అన్ని అబద్దాలే తప్ప నిజం లేదు

ఉద్యోగస్తులపై సర్కార్ కేసులు పెడుతోందన్నారు...

Harish Rao : రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సమావేశం పెట్టి నిరాశపరిచిందని మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ… ఆరు గ్యారెంటీలను ప్రభుత్వం మరిచిపోయిందన్నారు. గాలి మోటార్‌పై తిరుగుతూ గాలి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఒక్క డీఏ ఇచ్చేందుకు ముచ్చటగా మూడు కమిటీలు వేశారని… దీనికి కేబినెట్‌లో అయిదు గంటల చర్చ చేశారని వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం నిట్ట నిలువునా ముంచుతోందన్నారు. తక్షణమే మూడు డీఏలు చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు.

MLA Harish Rao Slams

ఉద్యోగస్తులపై సర్కార్ కేసులు పెడుతోందన్నారు. ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యదర్శిలు అప్పులు తెచ్చి గ్రామాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అబద్ధాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మించిపోయారని వ్యాఖ్యలు చేశారు. ఉత్తమ్ కుమార్ ఏది మాట్లాడినా అబద్దామే అని.. గ్లోబల్ బతికుంటే, ఉరివేసుకుని చనిపోయేవాడంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో క్రాఫ్ హాలిడే ప్రకటించిందన్నారు. 65 టీఎంసీల నీటిని ఉపయోగించకుండా చేసింది ఉత్తమ్ అంటూ ఆరోపించారు. నీతి అయోగ్ మీటింగ్‌లో ప్రధానిని రేవంత్ రెడ్డి ఎందుకు ప్రశ్నించలేదని అడిగారు.

గోదావరి బనకచర్ల కోసం బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టు వెళ్తుందన్నారు. గోదావరి బనకచర్ల మీద బీజేపీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. శ్రీశైలం రైడింగ్ ప్రాజెక్టు పనులు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. గోదావరి బనకచర్ల ప్రాజెక్టును ఉత్తమ్ కుమార్ రెడ్డి అడ్డుకోవాలన్నారు. కాళేశ్వరం కుప్ప కూలిందని చెప్పే రేవంత్ రెడ్డి గంగమళ్ళకు నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించారు. కాళేశ్వరం కూలిందని కాంగ్రెస్ ప్రభుత్వం గ్లోబల్ ప్రచారం చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read : Minister Uttam Kumar Reddy : బనకచెర్ల ప్రాజెక్ట్ ను ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించబోము

Leave A Reply

Your Email Id will not be published!