MLC Vamsi Krishna : ముఖ్యమంత్రి ప్యాలెస్ కోసం రుషికొండ ధ్వంసం

విశాఖ తూర్పు నియోజకవర్గంలో గ్రామ సింహం పులిలా ఫీల్ అవుతుందని అన్నారు

MLC Vamsi Krishna : తూర్పు విశాఖలో నిర్వహించిన శంఖారావం సభలో వైసీపీ ప్రభుత్వ తీరును విమర్శించారు. దేశంలోనే అత్యంత చారిత్రక ప్రాధాన్యత కలిగిన రుషికొండను ధ్వంసం చేసి విశాఖపట్నంలో సీఎం జగన్ కోసం ప్యాలెస్ నిర్మించారని జనసేన నేత, ఎమ్మెల్సీ వంశీకృష్ణ అన్నారు. తూర్పు విశాఖలో నిర్వహించిన శంఖారావం సభలో వైసీపీ ప్రభుత్వ తీరును విమర్శించారు. విశాఖ తీరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత వచ్చే ప్రభుత్వంపై ఉందన్నారు. సింహాచలం దేవస్థానం ఆస్తులకు సంబంధించిన సమస్యలను స్పష్టం చేసి పరిష్కరించాలన్నారు.

MLC Vamsi Krishna Slams

విశాఖ తూర్పు నియోజకవర్గంలో గ్రామ సింహం పులిలా ఫీల్ అవుతుందని అన్నారు. వెలగపూడి రామకృష్ణబాబును 70 వేల మెజార్టీతో గెలిపించి బంగాళాఖాతంలో గ్రామా సింహాన్ని కలుపుతామన్నారు. గ్రామ సింహం పేరును రెడ్ బుక్‌లో చేర్చాలని కోరుతున్నట్లు తెలిపారు. విశాఖ ఈస్ట్ మ్యాచ్‌లో రక్తం చిందించినా రామకృష్ణబాబును చిత్తుగా గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Also Read : Ayodhya Trust : అయోధ్య బాల రాముడి దర్శన ఏర్పాట్లపై టీటీడీ సలహాలు

Leave A Reply

Your Email Id will not be published!