Modi Silver Currency Note: ఎన్నికల ఫలితాలు అంచనా వేసిన వారికి మోదీ ఫోటోతో కూడిన రూ.2 వేల వెండి నోటు !

ఎన్నికల ఫలితాలు అంచనా వేసిన వారికి మోదీ ఫోటోతో కూడిన రూ.2 వేల వెండి నోటు !

Modi Silver Currency Note: మధ్యప్రదేశ్ లోని ఓ బంగారు వ్యాపారి బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఇటీవల జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో విజేత మెజార్టీను అంచనా వేసిన వారికి మోదీ ఫోటోతో కూడిన రెండు వేల రూపాయల నోటును బహూకరిస్తున్నట్లు ప్రకటించారు. ఎన్నికల ఫలితాలను అంచనా వేసిన వారిలో లక్కీ డ్రా ద్వారా 51 మందిని ఎంపిక చేసి… వారికి ఈ రెండు వేల రూపాయల వెండినోటులు బహూకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…

Modi Silver Currency Note..

మధ్యప్రదేశ్‌ లోని ఇండోర్‌ లోక్‌సభ నియోజకవర్గ ఎన్నికల విజేత మెజార్టీని అంచనా వేసిన 51 మందికి రూ.2 వేల వెండినోట్లను బహుమతిగా అందించనున్నట్లు బంగారు వ్యాపారి నిర్మల్‌ వర్మ ప్రకటించారు. ఈ రెండు వేల నోటుపై జాతిపిత మహాత్మాగాంధీతోపాటు ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో ఉంటుందన్నారు. మోదీ(Modi)పై అభిమానంతో ఓటింగును పెంచేందుకే ఇలా చేస్తున్నట్లు తెలిపారు. ఇండోర్‌లో కాంగ్రెస్‌ పోటీలో లేనందున బీజేపీ, ఇతర అభ్యర్థులకు మధ్య పోటీ నెలకొంది. జూన్‌ 4న బీజేపీ అభ్యర్థి శంకర్‌ లాల్వానీ లక్కీ డ్రా తీసి 51 మంది విజేతలను ప్రకటించి, బహుమతులు అందిస్తారని నిర్మల్‌ వర్మ తెలిపారు. ఈ పోటీకి ఇప్పటికే వందల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు వచ్చాయి. ఓట్ల లెక్కింపునకు ఒకరోజు ముందు వరకు అంటే జూన్‌ 3 వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతుందని బంగారం వ్యాపారి నిర్మల్ వర్మ ప్రకటించారు.

Also Read : CM Revanth Reddy : రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికి మాజీ సీఎం కు ఆహ్వానం పంపిన సర్కారు

Leave A Reply

Your Email Id will not be published!