Mohammed Azaharuddin : కిర్మానితో అజ్బూ భాయ్ ముచ్చ‌ట 

దిగ్గ‌జ క్రికెట‌ర్ల క‌ల‌యిక వైర‌ల్

Mohammed Azaharuddin : భార‌త‌దేశ క్రికెట్ చ‌రిత్ర‌లో వారిద్ద‌రూ అద్భుత‌మైన ఆట‌గాళ్లు. ఒక‌రు క్రికెట్ లో ఎంట‌ర‌వుతూనే ప్ర‌పంచ రికార్డు సృష్టించాడు. ఇండియాకు ఎన‌లేని విజ‌యాలు సాధించి పెట్టాడు.

మ‌ణిక‌ట్టు మాయ‌జాలంతో ప్ర‌పంచాన్ని విస్మ‌య ప‌రిచేలా చేశాడు. ఫీల్డింగ్ లో త‌న‌కు ఎదురే లేద‌ని ఆద‌ర్శంగా నిలిచాడు. అత‌డు ఎవ‌రో కాదు యావ‌త్ క్రికెట్ అభిమానులు ముద్దుగా పిలుచుకునే అజ్జూ భాయ్ ఉర‌ఫ్ మ‌హ‌మ్మ‌ద్ అజ‌హ‌రుద్దీన్.

మాజీ క్రికెట‌ర్ , మాజీ కాంగ్రెస్ పార్టీ ఎంపీ. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ కు చీఫ్ గా ఉన్నాడు. అజ్జూ భాయ్(Mohammed Azaharuddin) ప్ర‌స్తుతం క్రికెట్ ప‌రంగా పిల్ల‌ల‌కు కోచింగ్ ఇచ్చే పనిలో ఉన్నాడు.

ఇటీవ‌లే దుబాయిలో టీ10 క్రికెట్ రిచ్ లీగ్ లో ఇండియా లెజెండ్స్ టీమ్ కు కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రించాడు. ఇదిలా ఉండ‌గా అజ‌హ‌రుద్దీన్ త‌న స‌హ‌చ‌రుడు, తాను సోద‌రుడిగా భావించే ప్ర‌ముఖ భార‌తీయ మాజీ వికెట్ కీప‌ర్ స‌య్య‌ద్ కిర్మానితో భేటీ అయ్యారు.

అజ్జూ, స‌య్య‌ద్ సాబ్ లు ఈ సంద‌ర్బంగా తాము ఆడిన మ్యాచ్ ల గురించి చ‌ర్చించుకున్నారు. ఈ సంద‌ర్భంగా వారితో పాటు విజ‌య్ లోక్ ప‌ల్లిని క‌లుసుకున్నాడు.

ఈ అరుదైన క‌ల‌యిక‌కు గుర్తుగా ఇవాళ ట్విట్ట‌ర్ వేదిక‌గా షేర్ చేశాడు అజ‌హ‌రుద్దీన్(Mohammed Azaharuddin). దిగ్గజాల‌తో ములాఖ‌త్ కావ‌డం త‌న‌కు ఎంతో సంతోషం క‌లిగించిందంటూ పేర్కొన్నాడు.

ప్ర‌స్తుతం ఈ ఫోటో వైర‌ల్ గా మారింది. అజ్జూ భాయ్ జీతే ర‌హో అంటున్నారు ఆయ‌న ఫ్యాన్స్.

Also Read : వారెవ్వా బెన్ స్టోక్స్ అదుర్స్

Leave A Reply

Your Email Id will not be published!