MP Kiran Kumar Reddy : వాస్తవాలు చెప్పాలంటే లేఖలు కాదు..ఆధారాలు బయటపెట్టాలి
దెయ్యాలు ఎవరో కవిత బయటపెట్టాలని...
Kiran Kumar Reddy : ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ గురించి వాస్తవాలు చెప్పాలని అనుకుంటే లేఖలు, లీకులు కాదని.. అందుకు అవసరమైన ఆధారాలు కవిత బయటపెట్టాలని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కోరారు. కేసీఆర్ హయాంలో పదేళ్లలో జరిగిన అవినీతిపై కవిత దర్యాప్తు కోరాలని అన్నారు. ఇవాళ(గురువారం) ఢిల్లీలో కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
Kiran Kumar Reddy Slams MLC Kavitha
దెయ్యాలు ఎవరో కవిత(MLC Kavitha) బయటపెట్టాలని.. దర్యాప్తు కోరాలని చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కలిసి రాజకీయాలు చేస్తున్నాయని తమ నేతలు మొదటి నుంచి చెబుతునే ఉన్నారని గుర్తుచేశారు. ఈరోజు కవిత వ్యాఖ్యలు దాన్ని నిజం చేశాయని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్కి కవిత అవసరం లేదని.. తమకు సమర్థమైన నాయకత్వం ఉందని.. తమ పార్టీలోకి కొత్త వాళ్లు అవసరం లేదని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(Kiran Kumar Reddy) స్పష్టం చేశారు.
కవిత వ్యాఖ్యలతో కేసీఆర్ అసలు రంగు బయటపడిందని తెలంగాణ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. బీజేపీలో బీఆర్ఎస్ను కలపాలని ఆయన చూసినట్లు బయటపడిందని అన్నారు. ఇవాళ(గురువారం) గాంధీభవన్లో బీర్ల ఐలయ్య మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఉన్న ముసుగు తొలగిపోయిందని చెప్పుకొచ్చారు. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి 8 సీట్లు రావడానికి బీఆర్ఎస్ పార్టీనే కారణమని అన్నారు. కాంగ్రెస్ను దెబ్బ తీయడానికి ఆ రెండు పార్టీలు ఏకమయ్యాయని చెప్పారు బీర్ల ఐలయ్య.
కేసీఆర్ ఎందుకు బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేయాలనుకున్నారో కవిత బయట పెట్టాలని బీర్ల ఐలయ్య కోరారు. కేటీఆర్ బండారాన్ని కవిత బయట పెట్టిందని చెప్పుకొచ్చారు. పార్టీ నుంచి కవితను బయటకు పంపించడానికి కేటీఆర్ కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. సొంత చెల్లిని చూసి ఓర్వలేని కేటీఆర్ తెలంగాణ ఆడబిడ్డలను ఎలా గౌరవిస్తారని ప్రశ్నల వర్షం కురిపించారు. కేటీఆర్ దమ్ముంటే కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీతో డీల్పైన బీఆర్ఎస్ కార్యకర్తలకు సమాధానం చెప్పాలని కోరారు. కుటుంబాన్ని చక్కపెట్టుకోలేని కేటీఆర్.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గురించి మాట్లాడుతారా అని బీర్ల ఐలయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : PM Narendra Modi : బెంగాల్ లో అరాచకం తప్ప అభివృద్ధి శూన్యం