Chandrababu Naidu : ప్రాజెక్టుల ఊసెత్త‌ని జ‌గ‌న్

ఇంకెంత కాలం ఈ మోసం

Chandrababu Naidu : ఏపీ స‌ర్కార్ అస‌మ‌ర్థ‌త వ‌ల్ల రాష్ట్రంలో ప్రాజెక్టుల ప‌నితీరు దారుణంగా ఉంద‌న్నారు మాజీ సీఎం, టీడీపీ చీఫ్ నారా చంద్ర‌బాబు నాయుడు. ఆయ‌న ప్రాజెక్టుల బాట ప‌ట్టారు. పులివెందుల‌లో బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌సంగించారు. అంత‌కు ముందు త‌మ హ‌యాంలో మంజూరు చేసిన నిధులు, జ‌గ‌న్ ఇచ్చిన హామీలు, ప్రాజెక్టుల గురించి పూర్తి వివ‌రాల‌తో స‌హా ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఇచ్చారు.

Chandrababu Naidu Presentation

ఈ సంద‌ర్బంగా ప్ర‌స్తుత ప్ర‌భుత్వంపై నిప్పులు చెరిగారు. ప్ర‌ధానంగా రాయ‌ల‌సీమ‌పై ఫోక‌స్ పెట్టామ‌న్నారు. వైసీపీ వైఫ‌ల్యాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకు వెళ్లేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారు నారా చంద్ర‌బాబు నాయుడు(Chandrababu Naidu). పులివెందుల‌కు చేరుకున్న బాబుకు జ‌నం బ్ర‌హ్మ‌రథం ప‌ట్టారు. క‌డ‌ప జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. అంత‌కు ముందు ఆయ‌న జ‌మ్మ‌ల మ‌డుగు లోని గండికోట రిజ‌ర్వాయ‌ర్ ను సంద‌ర్శించారు.

రాయ‌ల‌సీమ లోని నాలుగు జిల్లాల్లోని ప్రాజెక్టుల కోసం త‌మ ప్ర‌భుత్వం రూ. 12,441 కోట్లు ఖ‌ర్చు చేసింద‌న్నారు చంద్ర‌బాబు. అయితే వైసీపీ స‌ర్కార్ కేవ‌లం నాలుగు సంవ‌త్స‌రాల కాలంలో ఖ‌ర్చు చేసింది క‌వేలం రూ. 2,011 కోట్లు మాత్ర‌మేన‌ని పేర్కొన్నారు.

ఇక తెలుగు గంగ కోసం తాము 5 వేల కోట్ల‌కు పైగా ఖ‌ర్చు చేశామ‌ని కానీ జ‌గ‌న్ కేవ‌లం రూ. 383 కోట్లు మాత్ర‌మే ఖ‌ర్చు చేశార‌ని ఆరోపించారు. అయితే వైసీపీ నేత‌లు స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చేందుకు సిద్ద‌మ‌య్యారు.

Also Read : Nara Lokesh : జ‌గ‌న్ పాల‌న జ‌నం ఆవేద‌న

Leave A Reply

Your Email Id will not be published!