Tirumala : మరోసారి తిరుమల శ్రీవారి ఆలయంపై నుంచి విమానం

కేంద్ర పౌరవిమానయాన శాఖ మాత్రం ఈ నిబంధన అమలు చేయడం వీలుకాదని తెలిపింది...

Tirumala : తిరుమల శ్రీవారి ఆలయంపై నుంచి మరోసారి విమానం వెళ్లడం కలకలం రేపుతోంది. ఆదివారం ఉదయం స్వామివారి ఆలయం గోపురం పైనుంచి అతి తక్కువ ఎత్తులో విమానం వెళ్లింది. కొందరు భక్తులు గమనించి తమ మొబైల్స్‌లో రికార్డ్ చేశారు.. కొందరు భక్తులు ఈ విషయాన్ని టీటీడీ విజిలెన్స్ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. ఆలయం మీదుగా వెళ్లిన విమానం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లిందో టీటీడీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఆగమశాస్త్రం ప్రకారం తిరుమల(Tirumala) శ్రీవారి ఆలయం మీదుగా విమానాలు, హెలికాప్టర్లు ఎగరడం విరుద్ధం. అందుకే తిరుమలను నో ఫ్లై జోన్‌గా ప్రకటించాలని గతంలోనే.. పలు సందర్భాల్లో కేంద్రాన్ని టీటీడీ కోరింది. కేంద్ర పౌరవిమానయాన శాఖ మాత్రం ఈ నిబంధన అమలు చేయడం వీలుకాదని తెలిపింది.

Plane Flew on Tirumala Temple

శ్రీవారి ఆలయం ఆలయంపై ఎటువంటి రాకపోకలు సాగకూడదని ఆగమ నిబంధనలు చెబుతున్నప్పటికీ తరచూ స్వామి ఆలయంపై నుంచి విమానాలు, హెలీకాఫ్టర్లు వెళుతున్నాయి. తిరుమలను నో ఫ్లై జోన్‌గా ప్రకటించాలన్న టిటిడి విజ్ఞప్తిని కేంద్ర విమానాయన శాఖ పట్టించుకోవడం లేదు. దీనిపై శ్రీవారి భక్తులు ఆందోళన చెందుతున్నారు. గత రెండు, మూడేళ్లుగా శ్రీవారి ఆలయం మీదుగా విమానాలు, హెలికాప్టర్లు ఎగిరిన సందర్భాలు ఉన్నాయి. గతంలో అలాంటి ఘటనలు జరిగిన సమయంలో భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని టీటీడీ స్పందించింది. కొంతకాలంగా తరచూ విమానాలు, హెలికాప్టర్లు స్వామివారి ఆలయం మీదుగా వెళుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

Also Read : Phone Tapping Case : సుప్రీంకోర్టు ఆదేశాలతో మాజీ ఎస్ఐబీ ప్రభాకర్ రావు ఇండియాకు

Leave A Reply

Your Email Id will not be published!