Paka Satyanarayana : విజయసాయి రెడ్డి స్థానంలో రాజ్యసభ ఎంపీగా ‘పాక వెంకట సత్యనారాయణ’
1961లో ఏపీలోని భీమవరంలో పాక సత్యనారాయణ జన్మించారు...
Paka Satyanarayana : రాజ్యసభ సభ్యుడిగా పాక వెంకట సత్యనారాయణ(Paka Satyanarayana) ప్రమాణ స్వీకారం చేశారు. ఈరోజు (బుధవారం) మధ్యాహ్నం సత్యనారాయణ చేత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ దన్ఖడ్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్, ఎంపీ లక్ష్మణ్, ఏపీ మంత్రి సత్య కుమార్ హాజరయ్యారు. విజయసాయి రెడ్డి రాజీనామాతో ఏర్పడిన ఖాళీ స్థానానికి పాక సత్యనారాయణ అభ్యర్ధిని బీజేపీ ప్రకటించింది. ఏపీ నుంచి బీజేపీ ఎంపీగా పాక ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏప్రిల్ 2028 వరకు సత్యనారాయణ పదవిలో కొనసాగనున్నారు.
Paka Satyanarayana As a BJP Rajya Sabha MP
1961లో ఏపీలోని భీమవరంలో పాక సత్యనారాయణ జన్మించారు. 15ఏళ్ల వయస్సులోనే అంటే 1976లో ఆయన ఆర్ఎస్ఎస్లో చేరారు. ఆర్ఎస్ఎస్లో పాక సత్యానారాయణ క్రియాశీలకంగా పనిచేశారు. 1980లో బీజేపీలో చేరిన పాక.. ఆ తరవాత భీమవరం మున్సిపల్ కౌన్సిలర్గా ఎన్నికయ్యారు. 1996 లోక్సభ ఎన్నికల్లో నరసాపూర్ నుంచి బీజేపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత 2006 ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిని చవిచూశారు. 2006 నుంచి 2010 వరకు భీమవరం జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. అలాగే 2012 నుంచి 2018 వరకు ఏపీ బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. అలాగే 2014లో ఉమ్మడి ఏపీ ఎన్నికల మేనిఫెస్టో ముసాయిదా కమిటీ సభ్యుడిగా ఉన్నారు. 2018 నుంచి 2021 వరకు బీజేపీ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షుడిగా పాక సత్యనారాయణ పనిచేశారు. ప్రస్తుతం ఆయన బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణా కమిటీ చైర్మన్గా కొనసాగుతున్నారు.
ఇక.. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి కూటమి ప్రభుత్వం పాక సత్యనారాయణను నామినేట్ చేసింది. 2025, మే 6న ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ క్రమంలో ఈరోజు రాజ్యసభ సభ్యుడిగా పాక సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేశారు.
Also Read : Airbus: కర్ణాటకలో తొలి ప్రైవేట్ హెలికాప్టర్ తయారీ కేంద్రం