Ramdev Baba Pakistan : పాకిస్తాన్ ముక్కలవడం ఖాయం
రామ్ దేవ్ బాబా జోష్యం
Ramdev Baba Pakistan : యోగా గురు రామ్ దేవ్ బాబా షాకింగ్ కామెంట్స్ చేశారు. మరోసారి ఆయన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు. నిన్న కరోనాపై చీప్ కామంట్స్ చేసిన ఈ యోగా గురు ఇప్పుడు పాకిస్తాన్ పై బాణం ఎక్కు పెట్టారు. రాబోయే రోజుల్లో భారత దేశం సూపర్ పవర్ గా మారి పోతుందన్నారు. ఆపై నరేంద్ర మోదీ ప్రపంచానికి నాయకుడు కావడం ఖాయమన్నారు.
ఇదే సమయంలో అంతర్గత కలహాలతో, తీవ్రవాదుల ప్రాబల్యంతో, తీవ్ర ఆర్థిక సంక్షోభంతో పాకిస్తాన్ తల్లడిల్లుతోందని ఈ తరుణంలో పాకిస్తాన్ లోని చాలా ప్రాంతాల ప్రజలు తమను భారత్ లో చేర్చుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారని ఇది భారత్ కు లాభం చేకూర్చే అంశమని పేర్కొన్నారు రామ్ దేవ్ బాబా(Ramdev Baba Pakistan).
దీంతో పాకిస్తాన్ నాలుగు ముక్కలు ఖావడం ఖాయమని జోష్యం చెప్పారు యోగా బాబా. వేలాది మంది ప్రజలు భారత్ లో కలుస్తామంటూ ప్రదర్శనలు చేస్తున్నారని తెలిపారు. సాంస్కృతికంగా సామీప్యం కలిగి ఉండడంతో బలూచిస్తాన్ భారత్ లో కలిసేందుకు ముందుకు వస్తోందన్నారు రామ్ దేవ్ బాబా. అంతే కాదు త్వరలోనే పాకిస్తాన్ పంజాబ్ సింధ్ ప్రావిన్స్ కూడా ఇండియాలో కలవడం కాయమన్నారు. ప్రస్తుతం భారత దేశాన్ని తట్టుకునే శక్తి ఏ దేశానికి లేదన్నారు.
త్వరలోనే పాక్ ఆక్రమించుకున్న పీఓకేకు విముక్తి లభిస్తుందన్నారు రామ్ దేవ్ బాబా. ఈ దేశంలో ఉన్నంత స్వేచ్ఛ ఇంకెక్కడా లేదన్నారు. పాకిస్తాన్ పరిస్థితి దారుణంగా ఉందన్నారు. తమను తాము రక్షించు కోలేని స్థితిలో ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. ఈ తరుణంలో భారత్ పై దాడులు చేసేంత సీన్ ఆ దేశానికి లేదన్నారు. ఒకవేళ గనుక భారత్ ఎంట్రీ ఇస్తే చావు దెబ్బ తినడం ఖాయమన్నారు బాబా రామ్ దేవ్(Ramdev Baba Pakistan).
Also Read : శ్రీనగర్ లో వందేమాతరం భారత పతాకం