Palla Srinivasa Rao : ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తాం

ఒక్కో లబ్ధిదారునికి రూ.1000 కలిపి మూడు లక్షల మందికి రూ.4వేలు అందజేస్తామని తెలిపారు...

Palla Srinivasa Rao : మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా సూపర్ 6 అమలు చేస్తామని ఆంధ్రప్రదేశ్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. సామాజిక పింఛన్ల పంపిణీలో పల్లా పాల్గొన్నారు. గాజువాక నియోజకవర్గం 67వ వార్డులోని హైస్కూల్ రోడ్డులో టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పింఛన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి కూటమి మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా రూ.1000 పెంచుతామని ఇచ్చిన హామీని నెరవేర్చామన్నారు.

Palla Srinivasa Rao Comment

ఒక్కో లబ్ధిదారునికి రూ.1000 కలిపి మూడు లక్షల మందికి రూ.4వేలు అందజేస్తామని తెలిపారు. గత మూడు నెలల్లో లబ్ధిదారులకు రూ.3వేలు, ఈ నెల రూ.4వేలు మొత్తం రూ.7వేలు అందజేశామన్నారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలు ముక్తకంఠంతో స్వాగతం పలుకుతారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లకు పల్లా శ్రీనివాస్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Also Read : Botsa Satyanarayana : టీడీపీ విధానాలను ప్రశంసించిన మాజీ మంత్రి బొత్స

Leave A Reply

Your Email Id will not be published!