Parthiv Patel : ఆ రెండు జ‌ట్ల‌కే టైటిల్ గెలిచే ఛాన్స్

మాజీ క్రికెట‌ర్ పార్థివ్ ప‌టేల్ కామెంట్

Parthiv Patel  : ఐపీఎల్ 2022 రిచ్ లీగ్ లో ఏ జ‌ట్టు ప్లే ఆఫ్స్ కు చేరుకుంటుందో తెలియ‌డం లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు గుజ‌రాత్ టైటాన్స్ , రాజ‌స్థాన్ రాయ‌ల్స్ , ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ , స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ , రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్లు హాట్ ఫెవ‌రేట్ గా ఉన్నాయి.

ఇదిలా ఉండ‌గా తాజా, మాజీ ఆట‌గాళ్లు త‌మ‌కు తోచిన రీతిలో టైటిల్ గెలిచే ఛాన్స్ ఈసారి ఆ జ‌ట్ల‌కే ఉందంటున్నారు. భార‌త మాజీ క్రికెట‌ర్ పార్థివ్ ప‌టేల్(Parthiv Patel )సంచ‌ల‌న కామెంట్స్ చేశాడు.

ప్ర‌స్తుతం ముంబై వేదిక‌గా జ‌రుగుతున్న ఐపీఎల్ లో టైటిల్ గెలిచే స‌త్తా ఆ రెండు జ‌ట్ల‌కే ఉంద‌న్నాడు. వాటిని కూడా డిక్లేర్ చేశాడు.

ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో స‌త్తా చాటుతున్న హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజ‌రాత్ టైటాన్స్ , డుప్లెసిస్ సార‌థ్యంలోని బెంగ‌ళూరు ఎక్కువ‌గా అవ‌కాశాలు ఉన్నాయ‌ని, ఆ జ‌ట్లే ఫైన‌ల్ కు చేరుకుంటాయ‌ని జోష్యం చెప్పాడు.

ఈసారి గుజ‌రాత్ దూసుకు పోతోంద‌ని, దానిని క‌ట్ట‌డి చేయ‌డం ఎవ‌రి త‌రం కాద‌న్నాడు. ఇక బెంగ‌ళూరు విష‌యానికి వ‌స్తే రెండు మూడు మ్యాచ్ ల‌లో ఆడ‌క పోయినా విరాట్ కోహ్లీని త‌క్కువ‌గా అంచ‌నా వేసేందుకు వీలు లేద‌న్నాడు.

ఏ స‌మ‌య‌మంలోనైనా స‌త్తా చాటేందుకు రెడీగా ఉంటాడ‌ని పేర్కొన్నాడు. ఆ జ‌ట్టును కూడా నిలువ‌రించ‌డం ఏ జ‌ట్టుకు సాధ్యం కాద‌న్నాడు పార్థివ్ ప‌టేల్. మొత్తంగా గ‌తంలో 8 జ‌ట్లు పార్టిసిపేట్ చేస్తే ఈసారి 10 జ‌ట్లు పాల్గొంటున్నాయి.

ఇక ముంబై ఇండియ‌న్స్, చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్ల‌కు ఈసారి చాన్స్ లేకుండా పోయింది.

Also Read : రాజ‌స్థాన్ వ‌ర్సెస్ బెంగ‌ళూరు బిగ్ ఫైట్

Leave A Reply

Your Email Id will not be published!