Pawan Kalyan: అభిమానులు, కార్యకర్తలకు పిఠాపురం ఎమ్మెల్యే, మంత్రి పవన్ కళ్యాణ్ కీలక సూచన !

అభిమానులు, కార్యకర్తలకు పిఠాపురం ఎమ్మెల్యే, మంత్రి పవన్ కళ్యాణ్ కీలక సూచన !

అభిమానులు, కార్యకర్తలకు పిఠాపురం ఎమ్మెల్యే, మంత్రి పవన్ కళ్యాణ్ కీలక సూచన !

రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌కు ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు అభినందనలు, శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ఆయన్ను కలిసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో అభిమానులు, పార్టీ నాయకులకు పవన్‌ కళ్యాణ్‌ కీలక సూచన చేసారు. తనే స్వయంగా జిల్లాలవారీగా వచ్చి పార్టీ శ్రేణులు, అభిమానులను కలుస్తానని ప్రకటించారు. ఈ మేరకు పార్టీ తరపున లేఖను విడుదల చేసారు.

‘‘ప్రజా జీవితంలో ఉన్న నాయకులు, మేధావులు, నిపుణులు, సినీరంగంలో ఉన్నవారు, యువత, రైతులు ఇలా అందరూ నాకు అభినందనలు తెలుపుతున్నారు. ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. త్వరలోనే జిల్లాలవారీగా అందరినీ కలిసి మాట్లాడాలని నిర్ణయించుకున్నాను. నాకు అభినందనలు తెలియజేయడానికి వచ్చేవారు పూల బొకేలు, శాలువాలు తీసుకురావద్దని విజ్ఞప్తి చేస్తున్నా’’అని పవన్‌ తెలిపారు.

20న పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పర్యటన

తనను అఖండ మెజార్టీతో గెలిపించిన పిఠాపురం నియోజకవర్గంలో ఈనెల 20న పర్యటిస్తానని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. నియోజకవర్గ ప్రజలు, స్థానిక కార్యకర్తలను కలుస్తానన్నారు. ఆ తర్వాత దశలవారీగా అన్ని గ్రామాల్లో పర్యటిస్తానని చెప్పారు.

Leave A Reply

Your Email Id will not be published!