Perni Nani : ఏపీని విమ‌ర్శిస్తే ఊరుకుంటామా – నాని

ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి

Perni Nani : ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani) నిప్పులు చెరిగారు. ఆయ‌న జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను ఏకి పారేశారు. విష‌యం తెలుసుకోకుండా ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడితే ఊరుకుంటామా అని ప్ర‌శ్నించారు. పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. ఓ వైపు తెలంగాణ మంత్రులు నోటికి వ‌చ్చిన‌ట్లు త‌మ‌ను అంటే ప్ర‌శ్నించాల్సిన ప‌వ‌న్ కళ్యాణ్ ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాల‌న్నారు.

పొద్ద‌స్త‌మానం ప్యాకేజీలు త‌ప్ప ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాష్ట్ర బాగోగుల గురించి ఏనాడైనా ప‌ట్టించుకున్నాడా అని నిల‌దీశార్. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌ని హిత‌వు ప‌లికారు. కొంద‌రు నాయ‌కులు త‌మ స్వార్థ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం టార్గెట్ చేస్తున్నారంటూ పేర్ని నాని మండిప‌డ్డారు. ఇలాంటి వాళ్ల మాట‌లు న‌మ్మే ప‌రిస్థితిలో ఏపీ ప్ర‌జ‌లు లేర‌న్నారు.

మాజీ మంత్రి ప‌రోక్షంగా తెలంగాణ మంత్రులు హ‌రీష్ రావు, త‌దిత‌రులు చేసిన చ‌వ‌క‌బారు కామెంట్స్ ను ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. ఇదే స‌మ‌యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ తెలంగాణ మంత్రుల‌ను తిట్టిన వీడియోల‌ను కూడా ప్ర‌దర్శించారు. ఇది ఏ ర‌క‌మైన రాజ‌కీయ‌మో చెప్పాల‌ని డిమాండ్ చేశారు పేర్ని నాని. అమాస‌కో పున్నానికో వ‌చ్చి మాట్లాడి వెళ్లి పోయే ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు(Pawan Kalyan) మాట్లాడే అర్హ‌త లేద‌న్నారు.

మొత్తంగా ఇటు ఏపీ అటు తెలంగాణ‌లో రాజ‌కీయ నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్దం కొన‌సాగుతోంది. ప‌సందైన రాజ‌కీయం మ‌రింత వేడిని రాజేస్తోంది.

Also Read : ప్ర‌జ‌ల కోసం ప్ర‌భుత్వంపై యుద్దం

Leave A Reply

Your Email Id will not be published!