Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు విచారణపై ఉత్కంఠ

అయితే దీనిపై సింగిల్ ఎంట్రీ పర్మిట్ కావాలంటూ సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్నాయి...

Phone Tapping Case : తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న ఎస్‌ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణపై సస్పెన్స్ కొనసాగుతోంది. గురువారం ఆయన సిట్‌ అధికారుల ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే దీనిపై సింగిల్ ఎంట్రీ పర్మిట్ కావాలంటూ సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్నాయి.

Phone Tapping Case Updates

కాగా గత 14 నెలలుగా ప్రభాకర్ రావు(Prabhakar Rao) అమెరికాలోనే తలదాచుకుంటున్న విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాలమేరకు ఆయన ఇండియాకు వస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడుగా ప్రభాకర్ రావు ఉన్న విషయం విధితమే. అమెరికా నుంచి బుధవారం రాత్రి ఆయన హైదరాబాద్‌ చేరుకోవచ్చని సమాచారం ఉంది. ఒక వేళ ఆయన రాక ఆలస్యమైతే మరుసటి రోజున న్యాయవాదులతో కలిసి సిట్‌ విచారణకు హాజరవుతారని తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే ప్రభాకర్‌రావు భార్య హైదరాబాద్‌ చేరుకున్నట్లు సమాచారం.

కాగా ఎట్ట‌కేల‌కు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావును విచార‌ణ చేయ‌డానికి సెట్ అధికారులకు లైన్ క్లియర్ అయింది. ప్ర‌భాక‌ర్ రావు వ్య‌వ‌హారం, ఎన్నో మ‌లుపుల మీద మ‌లుపులు తిరిగింది. ఎట్ట‌కేల‌కు ఆయన విచారణ కోసం హైద‌రాబాద్ వస్తున్నారు. కాగా ఆయన చేసుకున్న ముంద‌స్తు బెయిలును హైకోర్టు కోట్టివేసింది. దీంతో ఆయన సుప్రీం కోర్టుకు వెళ్లారు.. అక్క‌డ ఊర‌ట ల‌భించింది. తాము చెప్పే వ‌ర‌కూ ప్రభాకర్ రావును అరెస్టు చేయ‌వ‌ద్దంటూ న్యాయస్థానం తీర్పు ఇస్తూ.. అధికారుల విచారణకు హాజరు కావాలని చెప్పడంతో ప్రభాకర్ రావు హైదరాబాద్‌కు వస్తున్నారు.

Also Read : Ambati Rambabu : పోలీసులను బెదిరించిన ఘటనలో మాజీ మంత్రి అంబటిపై కేసు

Leave A Reply

Your Email Id will not be published!