PM Modi Lauds Falu : ఫాలు మిల్లెట్స్ పాట‌కు మోదీ ఫిదా

తృణ ధాన్యాల ప్ర‌యోజ‌నాల‌పై సాంగ్

PM Modi Lauds Falu : ప్ర‌పంచ వ్యాప్తంగా పేరు పొందారు గ్రామీ అవార్డు విజేత‌గా నిలిచిన ఫ‌ల్గుణి ఫాలు షా. ఆమె వార్త‌ల్లో హాట్ టాపిక్ గా మారారు. తృణ ధాన్యాల గురించి భార‌త దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ఎక్కువ‌గా ప్ర‌చారం చేస్తున్నారు. అవి మాన‌వ జీవితానికి ఎంత అవ‌స‌ర‌మో చెప్ప‌క‌నే చెబుతున్నారు. ప్ర‌ధాన‌మంత్రి దేశ వ్యాప్తంగా తృణ ధాన్యాల‌ను ఒక పండుగ‌లా జ‌రుపు కోవాల‌ని పిలుపునిచ్చారు. ఇందు కోసం ప్ర‌త్యేకంగా స‌హాయ స‌హ‌కారాలు అంద‌జేస్తున్నారు. దీనిని ప్ర‌పంచ వ్యాప్తంగా ఒక ఉద్య‌మంలా ప్ర‌చారం చేయాల‌ని కోరారు న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ.

మోదీ చేసిన కృషి ఫ‌లించింది. ఈ మేర‌కు ఐక్య రాజ్య స‌మితి (యూఎన్ఓ) సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ఈ ఏడాదిని తృణ ధాన్యాల సంవ‌త్స‌రంగా ప్ర‌క‌టించింది. ఇదిలా ఉండ‌గా గ్రామీ విజేత ఫ‌ల్గుణి ఫాలు షా మిల్లెట్స్ పై ప్ర‌త్యేకంగా పాట‌ను రూపొందించారు. ఇందుకు సంబంధించి ప్ర‌ధాన‌మంత్రి మోదీ(PM Modi Lauds Falu) స‌హ‌క‌రించారు. ఇందుకు సంబంధించి ఈ విష‌యాన్ని ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు ఫ‌ల్గుణి ఫాలు షా. ఆమె మోదీకి ధ‌న్య‌వాదాలు తెలిపారు.

ప్ర‌పంచంలో తృణ ధాన్యాలు రాను రాను త‌గ్గి పోతున్నాయి. ఎక్కువ‌గా మందులు, ర‌సాయ‌నిక ఎరువులు వాడ‌డం వ‌ల్ల అంత‌కంత‌కూ పంట‌లు క‌నుమ‌రుగై పోతున్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో తాను మిల్లెట్స్ పై రూపొందించిన సాంగ్ యూఎన్ ఓ గుర్తించ‌డం ఆనందంగా ఉంద‌న్నారు ఫాలు.

Also Read : MK Stalin : కేంద్రంపై అఖిల‌ప‌క్షం యుద్ధం

Leave A Reply

Your Email Id will not be published!