Power Cut : క్రికెట్ మ్యాచ్ కు పవర్ కట్
కర్ణాటక ప్రభుత్వం నిర్వాకం
Power Cut : బెంగళూరు – కర్ణాటకలో కొలువు తీరిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్వాకం కారణంగా ఐసీసీ వరల్డ్ కప్ మ్యాచ్ కు అంతరాయం ఏర్పడింది. ఇది దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనికి కారణంగా ప్రభుత్వం ఆశించిన మేర విద్యుత్ సరఫరా అందించక పోవడమేనని తేలింది. దీంతో ప్రతి ఒక్కరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ సర్కార్ పై.
Power Cut in Cricket Stadium
కర్ణాటకలో రోజు రోజుకు కరెంట్ కోతలు ఎక్కువై పోయాయి. బెంగళూరులో తాజాగా వరల్డ్ కప్ నిర్వహణలో భాగంగా క్రికెట్ మ్యాచ్ జరిగింది. మ్యాచ్ జరుగుతుండగా పవర్ పోయింది. దీంతో ఒక్కసారిగా అంధకారం అలుముకుంది. స్టేడియంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. తీరా చూస్తే ప్రధాన కారణం కరెంట్ కట్ అని తేలి పోయింది.
బీసీసీఐ క్లారిటీ కోరింది కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ను. ఐసీసీ(ICC) సైతం మండిపడింది. ఆ మాత్రం మ్యాచ్ లు నిర్వహించకుంటే ఎందుకు పర్మిషన్ ఇచ్చారనే దానిపై వివరణ కోరింది. మొత్తంగా కర్ణాటక సర్కార్ చేతగాని తనం ఇప్పుడు కేసీసీపై పడింది.
Also Read : Rekha Naik : ఎమ్మెల్యే రేఖా నాయక్ జంప్