PT Usha PM Modi : మోదీ ప‌నితీరు అద్భుతం – పీటీ ఉష

ఆయ‌న‌ను చూసి నేర్చుకోవాలి

PT Usha PM Modi : ప‌రుగుల రాణిగా పేరొందిన కేర‌ళ‌కు చెందిన క్రీడాకారిణి పీటీ ఉష కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆమె ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీని మ‌ర్యాద పూర్వ‌కంగా(PT Usha PM Modi) క‌లుసుకున్నారు. తాజాగా పీటీ ఉష అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన భార‌త ఒలింపిక్ సంఘం (ఐఓఏ)కు నూత‌న అధ్య‌క్షురాలిగా ఎన్నిక‌య్యారు.

విచిత్రం ఏమిటంటే పీటీ ఉష(PT Usha) ఒక్క‌రే నామినేష‌న్ దాఖ‌లు చేశారు. ఆమెకు వ్య‌తిరేకంగా ఎవ‌రూ నామినేష‌న్ దాఖ‌లు చేయ‌క పోవ‌డం విశేషం. దీంతో ఏక‌గ్ర‌వంగా ఐఓఏకు అధ్య‌క్షురాలిగా ఎన్నిక‌య్యారు. అంతే కాదు మోదీ నేతృత్వంలోని భార‌తీయ జ‌న‌తా పార్టీ సంకీర్ణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

ఈ మేర‌కు ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఇళ‌య‌రాజాతో పాటు కేర‌ళ‌కు చెందిన మాజీ ప‌రుగుల రాణి పీటీ ఉష‌కు రాజ్య‌స‌భ స‌భ్యురాలిగా నామినేట్ చేసింది. ఈ సంద‌ర్భంగా ఆమె ప్ర‌మాణ స్వీకారం చేయ‌డం, రాజ్య‌స‌భ‌లో అడుగు పెట్ట‌డం జ‌రిగింది.

ఇదిలా ఉండ‌గా భార‌త ఒలింపిక్ సంఘం నూత‌న అధ్య‌క్షురాలిగా ఎన్నికైన సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీని త‌న నివాసంలో క‌లుసుకున్నారు పీటీ ఉష‌.

ఈ విష‌యాన్ని ఆమె త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో వెల్ల‌డించారు. ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌ధాన‌మంత్రి మోదీ దేశం కోసం చేస్తున్న కృషి అద్భుత‌మ‌ని కొనియాడారు. అంతే కాదు ఆయ‌న ప‌నితీరును చూసి తాను విస్తు పోయాన‌ని పేర్కొన్నారు. మోదీని ఆద‌ర్శంగా త‌సుకోవాల‌ని కోరారు పీటీ ఉష‌. ఆయ‌న దేశానికి చేస్తున్న సేవ‌ను చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంద‌న్నారు.

Also Read : మోదీ మౌనం చైనా యుద్ధానికి సిద్దం

Leave A Reply

Your Email Id will not be published!