PBK vs RCB : ఆర్సీబీకి బిగ్ షాక్ పంజాబ్ విక్ట‌రీ

భారీ టార్గెట్ ను ఈజీగా ఛేద‌న

PBK vs RCB : ముంబై వేదిక‌గా జ‌రుగుతున్న ఐపీఎల్ -2022 రిచ్ లీగ్ లో ఊహించ‌ని ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. డిఫెండింగ్ ఛాంపియ‌న్ ను కేకేఆర్ ఓడించ‌గా టైటిల్ ఫేవ‌రేట్ గా ఉన్న ముంబై ఇండియ‌న్స్ (PBK vs RCB)కు ఢిల్లీ క్యాపిట‌ల్స్ షాక్ ఇచ్చింది.

మ‌రో మ్యాచ్ లో టోర్నీలో భారీ టార్గెట్ ను న‌మోదు చేసిన రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుపై సునాయ‌సంగా గెలిచి స‌త్తా చాటింది పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్. రెండు జ‌ట్ల‌కు ఇద్ద‌రూ కొత్త కెప్టెన్లు కావ‌డం విశేషం.

ఇక ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 205 ప‌రుగులు చేసింది. దీంతో బ‌రిలోకి దిగిన పంజాబ్ కింగ్స్(PBK vs RCB) కేవ‌లం 18.5 ఓవ‌ర్ల‌లోనే టార్గెట్ పూర్తి చేసింది. ఢిల్లీ క్యాపిట‌ల్స్ నుంచి తీసుకున్న శిఖ‌ర్ ధావ‌న్ రాణించాడు.

43 ప‌రుగులు చేస్తే శ్రీ‌లంక స్టార్ ప్లేయ‌ర్ బానుక రాజ‌ప‌క్స్ 43 ర‌న్స్ చేస్తే స్కిప్ప‌ర్ మ‌యాంక్ అగ‌ర్వాల్ 32 ర‌న్స్ చేసి రాణించాడు. ఇక గెలుస్తుందో లేదో అనుకున్న స‌మ‌యంలో షారుక్ ఖాన్ 24 ప‌రుగులు చేసి నాటౌట్ గా నిలిస్తే ఓడియ‌న్ స్మిత్ దుమ్ము రేపాడు.

25 ప‌రుగులు చేసి విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు. దీంతో 5 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది పంజాబ్ కింగ్స్ . ఇక ఆర్సీబీ బౌల‌ర్ల‌లో సిరాజ్ 2 , ఆకాశ్ దీప్ , హ‌స‌రంగా, హ‌ర్ష‌ల్ ప‌టేల్ చెరో వికెట్ తీశారు.

అంతకు ముందు ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్ 88 ర‌న్స్ చేస్తే కోహ్లీ 50 ప‌రుగులు చేసి ఆక‌ట్టుకున్నారు. కానీ పంజాబ్ చేతిలో ఓట‌మి పాల‌య్యారు.

Also Read : స్విస్ ఓపెన్ టైటిల్ గెలిచిన సింధు

Leave A Reply

Your Email Id will not be published!