Arvind Kejriwal : రూ.5,500 కోట్ల‌తో 277 ఎమ్మెల్యేల కొనుగోలు

మోదీ ప్ర‌గ‌తికి నిద‌ర్శ‌న‌మ‌న్న కేజ్రీవాల్

Arvind Kejriwal : ఆప్ చీఫ్‌, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. బీజేపీ యేత‌ర ప్ర‌భుత్వాల‌ను కూల్చ‌డంలో ఫుల్ బిజీగా ఉన్నారు ప్ర‌ధాన మంత్రి మోదీ అంటూ నిప్పులు చెరిగారు.

మోదీ మాట‌లు చెప్ప‌డం త‌ప్ప ఆచ‌ర‌ణ‌లో ఫెయిల్ అని పేర్కొన్నారు. పీఎం ఆర్భాటంగా ప్రారంభోత్స‌వం చేసిన కొత్త ర‌హ‌దారి కుప్ప కూలింద‌ని ఆరోపించారు.

ఇదే స‌మ‌యంలో త‌మ డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియా ఇంట్లో సోదాలు చేప‌ట్టిన సీబీఐకి పిల్ల‌ల బ‌ట్ట‌లు త‌ప్ప ఏమీ దొర‌క‌లేద‌న్నారు. 14 గంట‌ల పాటు సోదాలు చేప‌ట్టారని ఫ‌లితం లేక పోయింద‌న్నారు.

ఈ పోరాటం అవినీతిపై కాదు కేవ‌లం ఒక వ్య‌క్తి అధికార దాహం కోసం జ‌రుగుతున్న యుద్దంగా పేర్కొన్నారు అర‌వింద్ కేజ్రీవాల్. వ‌రుస దాడుల‌పై నిప్పులు చెరిగారు సీఎం. మేము ఏ త‌ప్పు చేయ‌లేదు.

కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లు ఎన్ని ప్ర‌యోగించినా ఏమీ ఉండ‌ద‌న్నారు. ఒక్క పైసా దొర‌క‌లేదు. ప‌త్రాలు లేవు. కేవ‌లం ఏదో భ‌య‌పెట్టాల‌ని మొబైల్, కంప్యూట‌ర్ల‌ను సీజ్ చేశార‌ని ఇందులో ఏమీ ల‌భించ‌ద‌ని స్ప‌ష్టం చేశారు అర‌వింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) .

మోదీ త్ర‌యం, బీజేపీ ప్ర‌ధాన టార్గెట్ దేశంలో ప్ర‌భుత్వాల‌ను కూల్చ‌డం. భ‌యాందోళ‌న‌కు గురి చేయ‌డం. కేసులు న‌మోదు చేయ‌డం, అరెస్ట్ ల‌కు పాల్ప‌డ‌డం ఇదే మోదీ(PM Modi) పాల‌న‌లో చేసిన ప్ర‌గ‌తికి నిద‌ర్శ‌న‌మ‌ని పేర్కొన్నారు.

ఇటీవ‌లి సంవ‌త్స‌రాల‌లో 277 మంది ఎమ్మెల్యేల‌ను బీజేపీ కొనుగోలు చేసింద‌ని, ఇందు కోసం రూ. 5,500 కోట్లు ఖ‌ర్చు చేసింద‌ని ఆరోపించారు.

Also Read : సోనాలీకి డ్ర‌గ్స్ ఇచ్చి రేప్ చేశారు

Leave A Reply

Your Email Id will not be published!