RR vs MI IPL 2022 : రాజ‌స్థాన్ రాజ‌సం ముంబై ప‌రాజ‌యం

23 ప‌రుగుల తేడాతో గ్రాండ్ విక్ట‌రీ

RR vs MI IPL 2022 : ఫుల్ జోష్ మీద ఉన్న రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఐపీఎల్ 2022 రిచ్ లీగ్ లో భాగంగా డివై పాటిల్ స్టేడియంలో జ‌రిగిన మ్యాచ్ లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ (RR vs MI IPL 2022)రెండో విజ‌యాన్ని న‌మోదు చేసింది.

ఇక ఐపీఎల్ ట్రాక్ రికార్డులో టాప్ లో ఉన్న రోహిత్ శ‌ర్మ సార‌థ్యంలోని ముంబై ఇండియన్స్ ఇది రెండోసారి ఓట‌మి పాలు కావ‌డం. ముంబై పై రాజ‌స్థాన్ 23 ప‌రుగుల తేడాతో గెలుపు సాధించింది.

ఇక మ్యాచ్ ప‌రంగా చూస్తే అత్యంత ఆస‌క్తిక‌రంగా సాగింది. 194 ప‌రుగుల భారీ టార్గెట్ తో క్రీజులోకి దిగిన ముంబై నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి 170 ర‌న్స్ కే చాప చుట్టేసింది.

ముంబై బ్యాట‌ర్ల‌లో తిల‌క్ వ‌ర్మ‌, ఇషాన్ కిషాన్ ర‌ఫ్పాడించినా జ‌ట్టును గ‌ట్టెక్కించ లేక పోయారు. వ‌ర్మ 61 ప‌రుగులు, కిష‌న్ 54 ర‌న్స్ చేసి చివ‌రి దాకా పోరాడారు.

వీరిద్ద‌రూ టాప్ స్కోర‌ర్ గా నిలిచారు జ‌ట్టు ప‌రంగా. ఇక రాజ‌స్తాన్ రాయ‌ల్స్(RR vs MI IPL 2022) బౌల‌ర్లు చివ‌రి దాకా స‌త్తా చాటేందుకు య‌త్నించారు. య‌జువేంద్ర చహాల్ , న‌వ‌దీప్ సైనీ చెరో రెండు వికెట్లు తీశారు.

బౌల్ట్ , ప్రసిద్ద్ కృష్ణ‌, ర‌విచంద్ర‌న్ అశ్విన్ చెరో వికెట్ ప‌డ‌గొట్టారు. అంత‌కు ముందు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 193 ప‌రుగుల భారీ స్కోర్ సాధించారు.

రోహిత్ శ‌ర్మ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసింది రాజ‌స్థాన్. జోస్ బ‌ట్ల‌ర్ అద్భుత‌మైన సెంచ‌రీ సాధించాడు. 68 బంతుల్లో 100 ర‌న్స్ చేస్తే కెప్టెన్ శాంస‌న్ 30 ర‌న్స్ చేశాడు. హెట్ మైర్ దుమ్ము రేపాడు. 35 ప‌రుగులు చేశాడు..

Also Read : అనుష్క చాలా హాట్ గురూ

Leave A Reply

Your Email Id will not be published!