RCB Sale : ఆర్సీబీ అధినేత సంచలన నిర్ణయం..ఫ్రాంచైజ్ అమ్మకానికి సిద్ధం
అయితే ప్రస్తుతం టీమ్లోని తమ వాటాను పాక్షికంగా లేదా పూర్తిగా విక్రయించాలని ప్లాన్స్ చేస్తున్నాయట...
RCB : ఐపీఎల్-2025 ట్రోఫీని గెలుచుకోవడంతో ఆర్సీబీ జట్టు సంబురాల్లో మునిగిపోయింది. తొలి కప్పు కల నెరవేరడంతో అభిమానులు కూడా ఫుల్గా సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే టైటిల్ నెగ్గినప్పటి నుంచి ఆ టీమ్కు ఏదీ కలసిరావడం లేదు. విక్టరీ పరేడ్లో తొక్కిసలాట జరగడం, 11 మంది ప్రాణాలు కోల్పోవడంతో తీవ్ర విమర్శల పాలైంది ఆర్సీబీ యాజమాన్యం. ముందస్తు ప్లానింగ్ లేకుండా హడావుడిగా కార్యక్రమం నిర్వహించారంటూ ఫ్రాంచైజీపై నెట్టింట భారీ ట్రోలింగ్ నడిచింది. ఈ తరుణంలో ఆర్సీబీ(RCB)ని అమ్మేస్తున్నారంటూ తాజాగా మరో విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజంగానే ఈ పాపులర్ ఫ్రాంచైజీని అమ్మేస్తున్నారా? ఈ జట్టుకు కొత్త ఓనర్ రానున్నారా? అసలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరులో ఏం జరుగుతోంది?
RCB Management Sale
ఆర్సీబీ(RCB)లోని తమ వాటాను విక్రయించాలని దాని మాతృసంస్థ, బ్రిటీష్ మద్యం తయారీ దిగ్గజం డయాజియో పీఎల్సీ ఆలోచిస్తోందని తెలుస్తోంది. డయాజియో పీఎల్సీ కంపెనీతో పాటు దాని భారతీయ అనుబంధ సంస్థ అయిన యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీలో వాటాలు కలిగి ఉన్నాయి. అయితే ప్రస్తుతం టీమ్లోని తమ వాటాను పాక్షికంగా లేదా పూర్తిగా విక్రయించాలని ప్లాన్స్ చేస్తున్నాయట.
ఐపీఎల్లో పాపులర్ ఫ్రాంచైజీల్లో ఆర్సీబీ ఒకటి. ఒక్క టైటిల్ నెగ్గకపోయినా 18 ఏళ్ల పాటు తన బ్రాండ్ ఇమేజ్ను చెక్కుచెదరకుండా చూసుకుంది బెంగళూరు. ఏటికేడు అభిమాన గణాన్ని పెంచుకుంటూ పోయింది. ఈసారి కప్పు నెగ్గడంతో ఆర్సీబీ బ్రాండ్ విలువ మరింతగా పెరిగింది. ఈ జట్టు విలువ సుమారు 2 బిలియన్ డాలర్లు ఉండొచ్చని వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే తమ వాటాను విక్రయించాలని డయాజియో పీఎల్సీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ వంటి స్పోర్టింగ్ ఈవెంట్స్లో మద్యం ప్రకటనల మీద ఆంక్షలు విధించాలని భారత సర్కారు నుంచి ఒత్తిడి రావడం కూడా వాటా విక్రయ ఆలోచనలకు ఓ కారణమని సమాచారం. దీనికి తోడు ఈ కంపెనీకి అతిపెద్ద మార్కెట్ అయిన యూఎస్లో ప్రీమియం మద్యం అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో వ్యయ నియంత్రణలో భాగంగా ఈ దిశగా డయాజియో ఆలోచన చేసి ఉండొచ్చని వినిపిస్తోంది.
Also Read : Minister Konda Surekha : తెలంగాణ బోనాల పండుగకు 20 కోట్లకు పైగా కేటాయింపులు