Bengaluru Stampede : తొక్కిసలాట కేసులో కర్ణాటక హైకోర్టు ను ఆశ్రయించిన ఆర్సీబీ
తమపై నమోదైన ఎఫ్ఐఆర్లను కొట్టివేయాలంటూ పిటిషన్లు దాఖలు చేశారు...
Bengaluru Stampede : చిన్నస్వామి స్టేడియం వెలుపల జూన్ 4న జరిగిన తొక్కిసలాట(Bengaluru Stampede) ఘటనకు సంబంధించి, ఐపీఎల్(IPL) జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) యజమాని రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ లిమిటెడ్ మరియు ఈవెంట్ ఆర్గనైజర్ డీఎన్ఏ ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్లు కర్ణాటక హైకోర్టును జూన్ 6న ఆశ్రయించాయి. తమపై నమోదైన ఎఫ్ఐఆర్లను కొట్టివేయాలంటూ పిటిషన్లు దాఖలు చేశారు.
Bengaluru Stampede – RCB Petition
ఈ ఘటనకు తమకు ఎలాంటి సంబంధం లేదని, క్రౌడ్ మేనేజ్మెంట్ బాధ్యతలు తమవిగా లేవని ఆర్సీఎస్ఎల్ పిటిషన్లో పేర్కొంది. విక్టరీ సెలబ్రేషన్స్ కోసం పరిమిత సంఖ్యలో పాస్లు మాత్రమే జారీ చేశామని, ఉచిత రిజిస్ట్రేషన్ పాస్లు ముందుగానే రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా సోషల్ మీడియా ద్వారా స్పష్టంగా ప్రకటించామని తెలిపింది. స్టేడియం గేట్లు ఆలస్యంగా తెరవడమే తొక్కిసలాటకు కారణమని పేర్కొంది. షెడ్యూల్ ప్రకారం గేట్లు మధ్యాహ్నం 1:45కి తెరవాల్సి ఉండగా, అవి 3:00 గంటల సమయంలో మాత్రమే తెరవడం వల్ల పెద్ద సంఖ్యలో ప్రజలు ఒక్కసారిగా అక్కడకు రావడం జరిగిందని వివరించింది.
ఇక డీఎన్ఏ ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్ తన పిటిషన్లో, ఈ ఘటనకు ప్రధానంగా పోలీసులు మరియు రాష్ట్ర ప్రభుత్వ అధికారుల వైఫల్యమే కారణమని ఆరోపించింది. మూడు లక్షల మందికి పైగా ప్రజలు వచ్చిన సందర్భంలో సరైన కంట్రోల్ లేకపోవడం, తగినన్ని పోలీసులను మోహరించకపోవడం, లాఠీచార్జ్ చేయడం వల్ల ప్రజల్లో కలకలం చెలరేగి తొక్కిసలాట చోటుచేసుకుందని తెలిపింది. ఎక్కువ మంది పోలీసులను విధానసభ వద్ద మోహరించడంతో స్టేడియం వద్ద సిబ్బంది తక్కువగా ఉండిపోయినట్లు పేర్కొంది.
క్రమశిక్షణా చర్యల నుండి తప్పించుకోవడానికి కుబ్బన్ పార్క్ పోలీస్ ఇన్స్పెక్టర్ స్వయంగా ఫిర్యాదు చేసినట్టు డీఎన్ఏ ఆరోపించింది. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా అప్రయత్నంగా, పక్షపాతపూరితంగా తమపై ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని తెలిపింది. జూన్ 6వ తేదీ ఉదయం ఎలాంటి విచారణ లేకుండానే తమ సంస్థకు చెందిన ఇద్దరు అధికారులను అరెస్ట్ చేసినట్లు పేర్కొంది. తమపై ఎటువంటి నేర సంబంధిత ఆధారాలు లేనందున ఎఫ్ఐఆర్లు కొట్టివేయాలని రెండు సంస్థలు హైకోర్టును కోరాయి.
Also Read : Ex CM YS Jagan : సాక్షి సీనియర్ రిపోర్టర్ కేఎస్ఎన్ అరెస్ట్ పై స్పందించిన మాజీ సీఎం