Jeevitha Rajasekhar : హైకమాండ్ ఆదేశిస్తే పోటీకి సై

న‌టి జీవిత రాజశేఖ‌ర్ కామెంట్

Jeevitha Rajasekhar : ప్ర‌ముఖ న‌టి , భార‌తీయ జ‌న‌తా పార్టీ నాయ‌కురాలు జీవిత రాజ‌శేఖ‌ర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. త‌మ పార్టీ అధిష్టానం గ‌నుక త‌న‌ను పోటీ చేయాల‌ని ఆదేశిస్తే త‌ప్ప‌కుండా బ‌రిలోకి దిగేందుకు రెడీగా ఉన్నాన‌ని స్ప‌ష్టం చేశారు. గురువారం హ‌న్మకొండ జిల్లా కొప్పూరు గ‌ద్ద‌ల‌బండ ఆంజ‌నేయ స్వామి టెంపుల్ వ‌ద్ద జ‌రిగిన సినిమా ప్రారంభోత్స‌వం పాల్గొన్నారు. అనంత‌రం జీవిత రాజ‌శేఖ‌ర్(Jeevitha Rajasekhar)  మీడియాతో మాట్లాడారు.

తాను దేనిని న‌మ్మ‌న‌ని కేవ‌లం క‌ర్మ సిద్దాంతాన్ని మాత్ర‌మే న‌మ్ముతాన‌ని చెప్పారు. ప్ర‌జ‌లు దీవిస్తే , ఆద‌రిస్తే పోటీ చేయాల‌ని కోరితే సిద్దంగా ఉన్నాన‌ని మ‌రోసారి పేర్కొన్నారు. క‌రోనా క‌ష్ట కాలంలో త‌న భ‌ర్త ఆరోగ్యం బాగుండాల‌ని అభిమానులు కోరుకున్నార‌ని అందుకే ఆరోగ్యంగా ఉన్నార‌ని తెలిపారు. బీజేపీ పార్టీ రాష్ట్రంలో త‌న‌ను ఎక్క‌డ నిలిపినా పోటీ చేసేందుకు ఉత్సుక‌త‌తో ఉన్నాన‌ని చెప్పారు జీవిత రాజ‌శేఖ‌ర్.

జీ గ్రూప్ సంస్థ ఆధ్వ‌ర్యంలోని జీ తెలుగు ఛాన‌ల్ ద్వారా త‌న‌కు అద్భుత‌మైన అవ‌కాశం ద‌క్కింద‌న్నారు. బ‌తుకు జ‌ట్కా బండి కార్య‌క్ర‌మం ద్వారా వేలాది మందికి ద‌గ్గ‌రైన‌ట్లు తెలిపారు.

వేల కుటుంబాల‌ను ఏకం చేసే అదృష్టం త‌న‌కు ద‌క్క‌డం ఆనందంగా ఉంద‌న్నారు జీవిత రాజ‌శేఖ‌ర్(Jeevitha Rajasekhar) . మ‌నం స్టార్లుగా భావిస్తున్న వారంతా ఒక‌ప్పుడు కింది స్థాయి నుంచి వ‌చ్చిన వారేన‌ని గుర్తు పెట్టు కోవాల‌న్నారు న‌టి, బీజేపీ నాయ‌కురాలు.

పార్టీ ఆదేశాల మేర‌కు తాను ప‌ర్య‌టిస్తున్నాన‌ని , ప్ర‌జ‌ల‌తో క‌లిసి చైత‌న్య‌వంతం చేస్తున్న‌ట్లు చెప్పారు. అంతే కాకుండా త‌న‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించినందుకు పార్టీకి రుణ‌ప‌డి ఉంటాన‌ని అన్నారు.

Also Read : కేసీఆర్ కు వైఎస్ ష‌ర్మిల స‌వాల్

Leave A Reply

Your Email Id will not be published!