Reserve Bank of India Shocking : 2,000 రూపాయల నోట్లపై ఆర్బీఐ కీలక ఆదేశాలు
2,000 రూపాయల నోట్లపై ఆర్బీఐ కీలక ఆదేశాలు
Reserve Bank of India : బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న అతి పెద్ద నిర్ణయాల్లో డీమోనిటైజేషన్ ఒకటి. అప్పటివరకు చలామణీలో ఉన్న 500, 1000 రూపాయల కరెన్సీ నోట్లను రద్దు చేస్తూ వాటి స్థానంలో 500, 2,000 రూపాయల నోట్లను 2016 నవంబర్ 8 నుండి అమలులోనికి ప్రభుత్వం తీసుకువచ్చింది. అప్పటివరకు చలామణీలో దొంగనోట్లకు డీమోనిటైజేషన్ పూర్తి స్థాయిలో అడ్డుకట్టవేయడం ద్వారా భారతదేశంలో ఉగ్రవాదాన్ని నియంత్రించ వచ్చు, నల్ల ధనాన్ని కూడా వెలికి తీయవచ్చు అంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం… ఆశించిన ఫలితాలు సాధించలేదు. అదే సమయంలో 2,000 రూపాయల కరెన్సీ నోటును అందుబాటులోనికి తీసుకురావడం వలన దేశంలో నల్లధనం మరింత పెరిగిపోవడంతో పాటు లంచం, ఎలక్షన్ లో పంచే ఓటుకు నోటు విలువ కూడా పెరిగిపోతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో… మరల కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయల నోట్లను ఉపసంహరించుకుంది. ఈ నేపథ్యంలో అప్పటివరకు చలామణీలో ఉన్న 2,000 రూపాయల నోట్లను వెనక్కి బ్యాంకులకు చెల్లించడానికి పలుమార్లు అవకాశం ఇచ్చింది.
Reserve Bank of India Key Orders on 2000 Notes
రూ.2వేల విలువైన నోటును ఉపసంహరించుకుంటున్నట్లు 2023 మే 19న ఆర్బీఐ(Reserve Bank of India) ప్రకటించింది. ఆ నిర్ణయం వెలువడే నాటికి రూ.3.56 లక్షల కోట్ల విలువైన నోట్లు చలామణీలో ఉన్నాయి. తొలుత బ్యాంకుల్లో నోట్ల మార్పిడి/డిపాజిట్కు ప్రజలకు 2023 సెప్టెంబర్ 30 వరకు అవకాశం ఇచ్చారు. అనంతరం అదే ఏడాది అక్టోబర్ 7 వరకు ఆ గడువును పొడిగించారు. ఆ తర్వాత నుంచి ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో మాత్రమే ఈ నోట్లను స్వీకరిస్తున్నారు. అలా ఫిబ్రవరి 28, 2025 వరకు 98.18 శాతం నోట్లు బ్యాంకులను చేరినట్లు ఆర్బీఐ వెల్లడించింది. రూ.2వేల విలువైన కరెన్సీ నోటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉపసంహరించుకుని దాదాపు 20 నెలల పైనే అయినప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో ఉపసంహరణ జరగలేదని ఆర్బీఐ స్పష్టం చేసింది.ఇంకా రూ.6471 కోట్ల విలువైన రూ.2వేల రూపాయల నోట్లు ప్రజల చేతుల్లోనే ఉన్నాయని తాజాగా ఆర్బీఐ (RBI) వెల్లడించింది.
దీనితో రూ.2వేల నోట్ల మార్పిడిపై ఆర్ఐబీ మరోసారి కీలక ఆదేశాలు జారీ చేసంది. ఇంకా ప్రజల చేతుల్లో ఉన్న నోట్లను ఆర్ఐబీ ప్రాంతీయ కార్యాలయాల వద్ద నోట్లను మార్పిడి/ డిపాజిట్ చేసుకోవచ్చని కేంద్ర బ్యాంక్ తెలిపింది. రీజనల్ ఆఫీసులకు చేరుకోలేనివారు పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా ఆయా కార్యాలయాలకు పంపొచ్చని పేర్కొంది. హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు, బేల్పుర్, భోపాల్, భువనేశ్వర్, ఛండీగడ్, చెన్నై, గువాహటి, జైపుర్, జమ్మూ, కాన్పుర్, కోల్కతా, లఖ్నవూ, ముంబయి, నాగ్పుర్, దిల్లీ, పట్నా, తిరువనంతపురంలో ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి.
Also Read : CP CV Anand : పోలీస్ స్టేషన్ లో సివిల్ పంచాయతీలు చేసిన అధికారులకు సీపీ వార్నింగ్