RK Roja Lokesh : ప‌ప్పు నాయుడుకు అంత సీన్ లేదు – రోజా

డైమండ్ పాపా అంటూ లోకేష్ కామెంట్స్

RK Roja Lokesh : ఏపీలో రాజ‌కీయాలు మ‌రింత ముదిరి పాకాన ప‌డ్డాయి. టీడీపీ, జ‌న‌సేన‌, వైసీపీ మ‌ధ్య మాట‌ల యుద్దం కొన‌సాగుతోంది. ఈ త‌రుణంలో ఒక‌రిపై మ‌రొక‌రు మాట‌ల తూటాలు పేల్చుతున్నారు. తాజాగా టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ యువ గ‌ళం పేరుతో పాద‌యాత్ర చేప‌ట్టారు. ప్ర‌స్తుతం కొన‌సాగుతోంది. ఈ సంద‌ర్బంగా ఆయ‌న రాష్ట్ర మంత్రి, న‌టి ఆర్కే రోజాపై సీరియ‌స్ కామెంట్స్ చేశారు. ఆపై నోరు కూడా జారారు.

ఆమెను డైమండ్ పాపా అంటూ సంబోధించారు. దీనిపై పెద్ద ఎత్తున రాద్దాంతం చోటు చేసుకుంది. త‌న‌ను చుల‌క‌న చేస్తూ మ‌హిళ అని చూడ‌కుండా వ్యాఖ్య‌లు చేసిన నారా లోకేష్ పై నిప్పులు చెరిగింది ఆర్కే రోజా. లోకేశ్ ను పప్పు నాయుడు అంటూ ఎద్దేవా చేశారు. ఇంకోసారి నోరు జారితీ తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించింది. స‌భ్య‌త లేకుండా మాట్లాడ‌టం టీడీపీ నేత‌ల‌కు అల‌వాటుగా మారింద‌న్నారు ఆర్కే రోజా.

తాను ఎందు కోసం పాద‌యాత్ర చేస్తున్నాడో ఆ పప్పు నాయుడుకు తెలియ‌దని అన్నారు. సెక్యూరిటీ త‌ప్ప జ‌నం లేర‌ని ఇక ఎందు కోసం దేని కోసం యాత్ర చేప‌ట్టారో ఆయ‌న‌కే అర్థం కావ‌డం లేదంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌మ నాయ‌కుడు కూడా పాద‌యాత్ర చేప‌ట్టార‌ని, కానీ ఆనాడు ఆయ‌న ప్రజా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకున్నార‌ని అన్నారు.

ఆ త‌ర్వాత ప‌వ‌ర్ లోకి వ‌చ్చాక ఒక్కో స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తూ వ‌స్తున్నార‌ని కానీ చంద్ర‌బాబుకు, ఆయ‌న కొడుక్కి ఆధారాలు లేకుండా ఆరోప‌ణ‌లు చేయ‌డం త‌ప్ప ఇంకొక‌టి రాద‌న్నారు ఆర్కే రోజా(RK Roja).

Also Read : ఏపీ రాజ‌ధానిపై జ‌గ‌న్ కీల‌క కామెంట్స్

Leave A Reply

Your Email Id will not be published!