Ravi Shastri : రోహిత్ శ‌ర్మ‌కు విశ్రాంతి అక్క‌ర్లేదు

స్ప‌ష్టం చేసిన మాజీ కోచ్ ర‌విశాస్త్రి

Ravi Shastri : భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ హెడ్ కోచ్ ర‌విశాస్త్రి(Ravi Shastri) సంచ‌ల‌న కామెంట్స్ చేశాడు. ఐపీఎల్ 2022లో ముంబై ఇండియ‌న్స్ పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో ఇంటి బాట ప‌ట్టింది. ఆ జ‌ట్టుతో పాటు చెన్నై సూప‌ర్ కింగ్స్ కూడా సేమ్ సీన్.

ఈ రెండు జ‌ట్లు అత్య‌ధిక ఐపీఎల్ టైటిళ్ల‌ను గెలిచాయి. కానీ ఈసారి చెత్త ప్ర‌ద‌ర్శ‌న‌తో నిరాశ ప‌రిచాయి. ఇక ఆఖ‌రి లీగ్ మ్యాచ్ లో ముంబై ఇండియ‌న్స్ త‌న పూర్వ ప్ర‌ద‌ర్శ‌న చాటింది.

ఏకంగా ప్లే ఆఫ్స్ కు ద‌గ్గ‌ర‌లో ఉన్న రిష‌బ్ పంత్ సార‌థ్యంలోని ఢిల్లీ క్యాపిట‌ల్స్ కు చుక్క‌లు చూపించింది. ఆ జ‌ట్టుపై 5 వికెట్ల తేడాతో 

గెలుపొందింది. దీంతో ప్లే ఆఫ్స్ ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లింది.

ఈ త‌రుణంలో భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు సెలెక్ష‌న్ క‌మిటీ తాజాగా స్వ‌దేశంలో ప‌ర్య‌టించే ద‌క్షిణాఫ్రికా జ‌ట్టుకు టీంను ప్ర‌క‌టించింది.

ఇక ఏకైక టెస్టు ఇంగ్లండ్ తో ఆడేందుకు గాను జ‌ట్టును వెల్ల‌డించింది.

కాగా విశ్రాంతి పేరుతో రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీని ప‌క్క‌న పెట్టింది. దీనిపై స్పందించారు ర‌విశాస్త్రి. తాను రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీకి విశ్రాంతి కావాల‌ని అనుకోవ‌డం లేద‌న్నాడు.

ఇదిలా ఉండ‌గా ముంబై ఇండియ‌న్స్ కు కెప్టెన్ గా ఉన్న రోహిత్ శ‌ర్మ పేల‌వ‌మైన ఆట తీరుతో నిరాశ ప‌రిచాడు. ఒక్క హాఫ్ సెంచ‌రీ చేయ‌లేక పోయాడు.

ఇక తిల‌క్ వ‌ర్మ ఒక్క‌డే ముంబై త‌ర‌పున రాణించాడు. 397 ప‌రుగులు చేశాడు. కాగా రోహిత్ శ‌ర్మ 14 మ్యాచ్ లు ఆడి 298 ప‌రుగులు చేశాడు రోహిత్ శ‌ర్మ‌(Rohit Sharma).

ఈ సంద‌ర్భంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు ర‌విశాస్త్రి. రోహిత్ కు ఇప్పుడు రెస్ట్ అవ‌స‌రం లేదు. విరాట్ విష‌యానికి వ‌స్తే ఒక ఏడాది పాటు అన్ని ఫార్మాట్ ల‌లో ఆడాడు.

గాయాల కార‌ణంగా రోహిత్ విశ్రాంతి తీసుకున్నాడు. ఎంపిక చేసి ఉంటేనే బెట‌ర్ అని పేర్కొన్నాడు శాస్త్రి(Ravi Shastri).

Also Read : బ్రాండ్ వాల్యూలో ముంబై ఇండియ‌న్స్ టాప్

Leave A Reply

Your Email Id will not be published!