Rohit Sharma : పర్యావరణ దినోత్సవం సందర్భంగా హిట్ మాన్ ఆసక్తికర వ్యాఖ్యలు

కాపాడాల్సిన ఆవశ్యకత ఉందంటూ కర్తవ్యాన్ని తెలియజెప్పే ప్రయత్నం చేశాడు...

Rohit Sharma : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ ఎడిషన్ ఎట్టకేలకు ముగిసింది. దీంతో ఆటగాళ్లు తమ కెరీర్ మీద దృష్టి సారిస్తున్నారు. ఇంటర్నేషనల్ సిరీస్‌ల్లో ఆడేవారు అక్కడ రాణించాలని చూస్తున్నారు. దేశానికి ఆడే అవకాశం దక్కనివారు దేశవాళీల్లో రాణించి తమ రాత మార్చుకోవాలని చూస్తున్నారు. ఈ తరుణంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) అందరికీ ఓ ప్రత్యేకమైన సందేశం ఇచ్చాడు. అందరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరాడు. కాపాడాల్సిన ఆవశ్యకత ఉందంటూ కర్తవ్యాన్ని తెలియజెప్పే ప్రయత్నం చేశాడు.

Rohit Sharma Interesting Comments

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఈ భూమిని ఆర్యోగకరంగా మార్చి భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత కచ్చితంగా మనందరి మీద ఉంది. దీన్ని అంతా గుర్తుంచుకోవాలి. ఈ గ్రహాన్ని నివాసయోగ్యంగా మలచడం కూడా మన చేతుల్లోనే ఉంది’ అని ప్రముఖ జీవశాస్త్రవేత్త డేవిడ్ అటెన్‌బరో కొటేషన్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు హిట్‌మ్యాన్. దీనికి వరల్డ్ ఎన్విరాన్‌మెంట్ డే అనే హ్యాష్‌ట్యాగ్‌ను జతచేశాడు. ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్స్.. రోహిత్ లాంటి సెలెబ్రిటీలు పర్యావరణ పరిరక్షణపై మరింతగా ప్రచారం చేయాలని సూచిస్తున్నారు. హిట్‌మ్యాన్ వంటి విశేష ప్రజాదరణ కలిగిన ప్రముఖులు చెబితే ఇలాంటి విషయాల్లో భారీ మార్పులు వచ్చే అవకాశం ఉందని కామెంట్స్ చేస్తున్నారు. కాగా, రోహిత్ ప్రాతినిధ్యం వహించిన ముంబై ఇండియన్స్.. ఐపీఎల్-2025లో ఫైనల్స్‌కు వెళ్లలేకపోయింది. క్వాలిఫయర్-2లో పంజాబ్ కింగ్స్ చేతుల్లో ఓడి ఇంటిదారి పట్టిందా టీమ్.

Also Read : MP Mahua Moitra Married : 65 ఏళ్ల ఎంపీ ని పెళ్లాడిన టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా

Leave A Reply

Your Email Id will not be published!