RK Roja : ఇక నుంచి జ‌బ‌ర్ద‌స్త్ చేయ‌ను – రోజా

మంత్రి రోజా సెల్వ‌మ‌ణి ప్ర‌క‌ట‌న

RK Roja : వైఎస్సార్ సీపీకి చెందిన చిత్తూరు జిల్లా న‌గ‌రి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ప్ర‌ముఖ న‌టి రోజా సెల్వ‌మ‌ణి (RK Roja)సంచ‌ల‌న కామెంట్స్ చేశారు.

ఈ మేర‌కు అత్యంత ప్ర‌జాద‌ర‌ణ పొందిన కార్య‌క్ర‌మంగా పేరొందిన ఈటీవీలో ప్ర‌సారం అవుతున్న జ‌బర్ద‌స్త్ ప్రోగ్రామ్ ను ఇక నుంచి చేయ‌బోవ‌డం లేద‌ని ప్ర‌క‌టించారు.

ఈ మేర‌కు ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడారు. తాజాగా ఏపీలో సీఎం జ‌గ‌న్ రెడ్డి కొత్త‌గా కేబినెట్ ను ప్ర‌క‌టించారు. ఈ మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో రోజా సెల్వ‌మ‌ణికి (RK Roja)చోటు ద‌క్కింది.

న‌లుగురు మ‌హిళ‌ల‌కు ఛాన్స్ ఇచ్చారు. మొద‌టి నుంచీ ఆమెకు మంత్రి ప‌ద‌వి ద‌క్కుతుంద‌ని అనుకున్నారు. కానీ ఫ‌స్ట్ కేబినెట్ లో చోటు ద‌క్క‌లేదు. ప్ర‌స్తుతం ప్ర‌క‌టించిన కేబినెట్ లో చోటు ద‌క్క‌డంతో ఈ నిర్ణ‌యం తీసుకోవాల్సి వ‌చ్చింద‌న్నారు రోజా.

కేబినెట్ హోదా క‌లిగిన మంత్రి ప‌ద‌వి నాకు సీఎం జ‌గ‌న్ ఇచ్చారు. ఈ త‌రుణంలో పూర్తి స‌మ‌యంలో ప‌ద‌వి కోసం కేటాయించాల్సి ఉంటుంది. దీంతో గ‌త కొంత కాలంగా నేను పార్టిసిపేట్ చేస్తున్న జ‌బ‌ర్ద‌స్త్ ప్రోగ్రాంకు పూర్తి స‌మ‌యం ఇవ్వ‌డం కుద‌ర‌దు.

ఆ ప్రోగ్రామ్ చేయాలంటే టైం ఎక్కువ ఉండాలి. అంతే కాదు షూటింగ్స్ ఉంటాయి. దీంతో ప‌ద‌వికి న్యాయం చేయ‌లేన‌ని చెప్పింది రోజా సెల్వ‌మ‌ణి. ఇక నుంచి టీవీ షోస్ , సినిమా షూటింగ్ లు చేయ‌న‌ని స్ప‌ష్టం చేశారు.

ఇక‌పై జ‌బ‌ర్ద‌స్త్ షోలో పాల్గొన‌బోన‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టారు. ఇదిలా ఉండ‌గా రోజా మొద‌ట్లో త‌న కెరీర్ ను సినిమాలో స్టార్ట్ చేసింది. అనంత‌రం ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సెల్వ‌మ‌ణిని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు కేబినెట్ లో చోటు ద‌క్కించుకుంది.

Also Read : య‌ష్ సుడిగాలి ప‌ర్య‌ట‌న‌

Leave A Reply

Your Email Id will not be published!