Sai Pallavi Pandits : కాశ్మీరీ పండిట్ల‌పై సాయి ప‌ల్ల‌వి కామెంట్స్

న‌టి వ్యాఖ్య‌ల‌పై సోష‌ల్ మీడియాలో వైర‌ల్

Sai Pallavi Pandits : దేశ వ్యాప్తంగా కాశ్మీరీ ఫైల్స్ మూవీ విడుద‌ల త‌ర్వాత పండిట్లపై జ‌రుగుతున్న దాడులు చ‌ర్చ‌కు దారి తీశాయి. తాజాగా ప్ర‌ముఖ న‌టి సాయి ప‌ల్ల‌వి(Sai Pallavi Pandits) విరాట్ ప‌ర్వం మూవీ ప్ర‌మోష‌న్ లో భాగంగా చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపాయి.

సోష‌ల్ మీడియాలో సాయి ప‌ల్ల‌వి వైర‌ల్ గా మారాయి. కొంద‌రు ఆమె వ్యాఖ్య‌ల్ని స‌పోర్ట్ చేస్తుండ‌గా మ‌రికొంద‌రు ట్రోల్ చేస్తున్నారు. మ‌తం పేరుతో జ‌రుగుతున్న హింస‌ను ఖండిస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది సాయి ప‌ల్ల‌వి.

ఆమె కాశ్మీరీల వ‌ల‌స‌ను ఆమె గో సంర‌క్ష‌ణ‌తో పోల్చారు. ఆ స‌మ‌యంలో కాశ్మీరీ పండిట్ల‌(Sai Pallavi Pandits) ను ఎలా చంపేశారో క‌శ్మీరీ ఫైల్స్ క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూపించారు ద‌ర్శ‌కుడు.

అదే స‌మ‌యంలో డ్రైవ‌ర్ ను కొట్టి జై శ్రీ‌రామ్ అని బ‌లవంతం చేసిన ఘ‌ట‌న ఇటీవ‌ల చోటు చేసుకుంది. ఈ రెండు సంఘ‌ట‌న‌ల మ‌ధ్య తేడా ఉంద‌న్నారు న‌టి సాయి ప‌ల్ల‌వి.

సాయి ప‌ల్ల‌వి విరాట ప‌ర్వం గురించి అభిప్రాయాల‌ను పంచుకుంది. ఈ చిత్రం 1990లో జ‌రిగిన వాస్త‌వ సంఘ‌ట‌న‌ల ఆధారంగా చిత్రాన్ని తెర‌కెక్కించారు ద‌ర్శ‌కుడు వేణు దుగ్గ‌ల‌. తెలంగాణ ప్రాంతంలో న‌క్స‌లైట్ ఉద్య‌మం నేప‌థ్యంలో సాగే ప్రేమ క‌థ ఉంది.

న‌క్స‌ల్ లీడ‌ర్ ర‌వ‌న్న (రానా ద‌గ్గుపాటి) తో ప్రేమ‌లో ప‌డే వెన్నెల పాత్ర‌లో సాయి ప‌ల్ల‌వి న‌టించింది. ఇదే స‌మ‌యంలో రాజ‌కీయాల గురించి కూడా ప్ర‌స్తావించారు.

తాను త‌ట‌స్థ కుటుంబం నుంచి వచ్చాన‌ని, కానీ మంచి మ‌నిషిగా ఉండేందుకు ఇష్ట ప‌డ‌తాన‌ని చెప్పారు సాయి ప‌ల్ల‌వి. ఇదే సమ‌యంలో ఆమె చేసిన కామెంట్స్ చ‌ర్చ‌కు దారి తీశాయి.

గాయ‌ప‌డిన వారిని ర‌క్షించాల‌ని, అణ‌చివేత‌కు గుర‌వుతున్న వారిని కాపాడాల‌ని అన్నారు.

Also Read : ‘777 చార్లీ’ మూవీ చూసి బొమ్మై కంట‌త‌డి

Leave A Reply

Your Email Id will not be published!