Sajjala Ramakrishna Reddy: ఎగ్జిట్‌ పోల్స్‌పై సజ్జల కీలక వ్యాఖ్యలు !

ఎగ్జిట్‌ పోల్స్‌పై సజ్జల కీలక వ్యాఖ్యలు !

Sajjala Ramakrishna Reddy: 2024 సార్వత్రిక ఎన్నికలు తది అంకానికి చేరుకున్నాయి. శనివారంతో ఏడో దశ పోలింగ్ కూడా ముగియడంతో… సాయంత్రం 6 గంటల నుండే వివిధ న్యూస్ ఛానెల్స్, సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ ను ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఏపీ ఎగ్జిట్ పోల్స్ పై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. ఎగ్జిట్‌ పోల్స్‌ ట్రెండ్‌ వైఎస్సార్‌సీకి అనుకూలంగా ఉందని… మేం అంచనా వేసిందే ఎగ్జిట్‌ పోల్స్‌లో వచ్చాయని.. ఫలితాలు దీనికంటే మెరుగ్గా ఉంటాయని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం విడుదలైన ఎగ్జిట్‌ పోల్స్‌పై ఆయన స్పందించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, మహిళలే కాదు కుటుంబం మొత్తం తమవైపే ఉందన్నారు.

Sajjala Ramakrishna Reddy Comment

‘‘మా పాలనలో మహిళలకు పెద్దపీట వేశాం.. వారి ఆత్మగౌరవాన్ని పెంచాం. సీఎం జగన్‌ ఉంటేనే మంచి జరుగుతుందని మహిళలు నమ్మారని సజ్జల అన్నారు. విపక్షాలు కూటమిగా వచ్చాయి. ఒంటరిగా పోటీ చేసే ధైర్యం టీడీపీకి లేదు. వైఎస్సార్‌సీపీకి పాజిటివ్‌ అజెండా కలిసి వచ్చింది. ఈ ఐదేళ్లలో మార్పు వచ్చిందని ప్రజలు నమ్మారు’’ అని సజ్జల పేర్కొన్నారు. ‘‘లంచాలు లేకుండా సంక్షేమ పథకాలు అందించాం. భారీస్థాయిలో మహిళలు వైఎస్సార్‌సీపీని మరోసారి ఆదరించారు. సర్వేలు మాకు అనుకూలంగా ఉన్నాయి’’ అని సజ్జల చెప్పారు.

Also Read : Telangana Governor: తెలంగాణా దశాబ్ది ఉత్సవాలకు గవర్నర్‌ కు ఆహ్వానం ! 

Leave A Reply

Your Email Id will not be published!