Sharmishta Panoli Case : ఇన్‌ఫ్లుయెన్సర్ శర్మిష్ట పనోలికి బెయిల్ నిరాకరించిన కోల్ కతా హైకోర్టు

వ్యక్తులు, మతపరమైన భావోద్వేగాలను గాయపరచ రాదని పేర్కొంది...

Sharmishta Panoli : ఆపరేషన్ సిందూర్ సమయంలో అభ్యంతరకర వ్యాఖ్యలతో వీడియో పోస్ట్ చేశారన్న ఆరోపణలపై అరెస్టయిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ శర్మిష్ఠ పనోలికి(Sharmishta Panoli) కోల్‌కతా హైకోర్టులో చుక్కెదురైంది. ఆమెకు బెయిల్ ఇచ్చేందుకు మంగళవారం నాడు హైకోర్టు నిరాకరించింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భావ ప్రకటనా స్వేచ్ఛకూ ఒక పరిమితి ఉంటుందని.. వ్యక్తులు, మతపరమైన భావోద్వేగాలను గాయపరచ రాదని పేర్కొంది.

Sharmishta Panoli Case Updates

‘మనకు భావ ప్రకటనా స్వేచ్ఛ ఉంది. అంటే దాని అర్ధం ఇతరుల మనోభావాలను గాయపరచమని కాదు. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం మనది. వివిధ భాషలు, కులాలు, మతాలు ఉన్నాయి. ఎవరినీ కించపరిచేలా మాట్లాడకూడదు. సోషల్ మీడియాలో వీడియో వచ్చినట్టు, ఒక వర్గం ప్రజల మనోభావాలను గాయపరిచినట్టు విన్నాం’ అని జస్టిస్ పార్ధసారథి చటర్జీ పేర్కొన్నారు. ఈ మేరకు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించారు.

పుణేకు చెందిన 22 ఏళ్ల న్యాయ విద్యార్థిని షర్మిష్ఠ పనోలి మే 14న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఒక మతాన్ని కించపరచేలా వ్యాఖ్యలు చేశారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆ వీడియోను ఆమె తొలగించడంతోపాటు క్షమాపణలు కూడా తెలియజేశారు. అయితే ఆమెను అరెస్టు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్లు రావడంతో కోల్‌కతా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి గత శుక్రవారంనాడు గురుగావ్‌లో అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపరచడంతో 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది.

కాగా పనోలీ, ఆమె కుటుంబసభ్యులకు లీగల్ నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ వారు పరారీలో ఉండటంతో సాధ్యం కాలేదని, దీంతో కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసిందని కోల్‌కతా పోలీసులు తెలిపారు. అయితే అలిపూర్ ఉమెన్స్ కరెక్షనల్ హోంలో అపరిశుభ్ర వాతావరణం, మెడికల్ కేర్ లేనందున పనోలీ ఆరోగ్యం క్షీణించినట్టు ఆమె తరఫు లాయర్ ఎండీ సమీముద్దీన్ మీడియాకు తెలిపారు.

Also Read : Minister Savitha : మాజీ సీఎం జగన్ ను ఖబడ్దార్ అంటూ హెచ్చరించిన మంత్రి సవిత

Leave A Reply

Your Email Id will not be published!