Rishabh Pant : ఓటమి బాధలో ఉన్న రిషబ్ పంత్ కు ఊహించని మరో షాక్

మరి.. బీసీసీఐ ఎందుకిలా చేసింది...

Rishabh Pant : ఐపీఎల్-2025ను లక్నో సూపర్ జెయింట్స్ పేలవంగా ముగించింది. ఎలాగూ ప్లేఆఫ్స్ బెర్త్ మిస్ అయింది కాబట్టి చివరి మ్యాచ్‌లోనైనా ఓదార్పు విజయాన్ని సాధించాలని అనుకుంది. సీజన్‌ను సానుకూలంగా ముగించాలని భావించింది. కానీ పంత్ సేనకు జితేష్ శర్మ సైంధవుడిలా అడ్డుపడ్డాడు. నోటి దాకా వచ్చిన గెలుపును అతడు లాక్కెళ్లిపోయాడు. 227 పరుగుల భారీ లక్ష్యాన్ని సెట్ చేసినా లక్నోకు ఓటమి తప్పలేదు. 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైన ఎల్‌ఎస్‌జీ.. 7వ స్థానంతో సీజన్‌ను ముగించింది. ఈ తరుణంలో ఆ జట్టు సారథి రిషబ్ పంత్(Rishabh Pant) జీతంలో కోత విధించింది భారత క్రికెట్ బోర్డు. అతడి మ్యాచ్ శాలరీలో నుంచి రూ.30 లక్షలు కట్ చేసేసింది. మరి.. బీసీసీఐ ఎందుకిలా చేసింది.. అసలే ఓటమి బాధలో ఉన్న పంత్‌కు ఈ జీతం గోల ఏంటి.. అనేది ఇప్పుడు చూద్దాం..

Rishabh Pant got Shock

ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించాడనే కారణంతో పంత్‌కు రూ.30 లక్షల జరిమానా విధించింది బీసీసీఐ(BCCI). ఆర్సీబీతో మ్యాచ్‌లో నిర్ణీత వ్యవధిలో ఓవర్లు పూర్తి చేయకపోవడంతో అతడికి ఫైన్ వేసింది బోర్డు. స్లో ఓవర్ రేట్ కింద జరిమానా కట్టాల్సిందిగా ఆదేశించింది. సాధారణంగా నిర్ణీత సమయంలో ఓవర్లు వేయకపోతే 12 లక్షలు ఫైన్ విధిస్తారు. కానీ ఈ సీజన్‌లో లక్నో స్లో ఓవర్ రేట్‌ నమోదు చేయడం ఇది మూడోసారి. అందుకే ఏకంగా రూ.30 లక్షల జరిమానా వేసింది బీసీసీఐ. అతడితో పాటు ఇతర లక్నో ఆటగాళ్లకూ ఫైన్ విధించింది. ఇంపాక్ట్ ప్లేయర్‌తో కలిపి ఎల్‌ఎస్‌జీ ప్లేయర్లంతా మ్యాచ్ ఫీజు నుంచి 50 శాతం మొత్తాన్ని చెల్లించాలి లేదా రూ.12 లక్షల చొప్పున కట్టాలని బీసీసీఐ ఆదేశించింది. కాగా, ఈ సీజన్ మొత్తం విఫలమవుతూ వచ్చిన పంత్.. ఆర్సీబీపై 61 బంతుల్లో 118 పరుగుల విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. అయితే సారథి జితేష్ (33 బంతుల్లో 85 నాటౌట్) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో లక్నో సంధించిన 227 పరుగుల లక్ష్యాన్ని మరో 8 బంతులు ఉండగానే ఛేదించింది ఆర్సీబీ.

Also Read : AP Rains : బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం..24 గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు

Leave A Reply

Your Email Id will not be published!