Smriti Mandhana : ఐసీసీ టాప్ 10లో స్మృతి మంధాన
మెరుగు పడిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ర్యాంకు
Smriti Mandhana : ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా మహిళా వన్డే ర్యాంకింగ్స్ ప్రకటించింది. టాప్ 10లో భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన(Smriti Mandhana) చోటు దక్కించుకుంది.
శ్రీలంక టూర్ లో భాగంగా భారత జట్టు 2-1 తేడాతో టి20 సీరీస్ గెలుచుకుంది. మూడు వన్డే మ్యాచ్ ల సీరీస్ ను కైవసం చేసుకుంది టీమిండియా. భారత మహిళా క్రికెటర్లు అద్భుతంగా రాణించారు.
ప్రధానంగా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ , వైస్ కెప్టెన్ స్మృతి మంధాన(Smriti Mandhana), పూజా వస్త్రాకర్ సత్తా చాటారు. ఈ సీరీస్ లో హర్మన్ ప్రీత్ కౌర్ 59.50 సగటుతో 119 రన్స్ చేసింది.
బౌలింగ్ లో 3 వికెట్లు తీసింది. ఓపెనర్ మంధాన 52 సగటుతో 104 రన్స్ చేసింది. ఐసీసీ ప్రకటించిన ర్యాంకుల్లో 9వ స్థానానికి చేరింది. బౌలింగ్ విభాగంలో రాజేశ్వరి గైక్వాడ్ సైతం సత్తా చాటింది.
ఇక ర్యాంకుల వారీగా చూస్తే 785 పాయింట్లతో ఆస్ట్రేలియాకు చెందిన అలిస్సా హీలీ నెంబర్ వన్ గా నిలిచింది. దక్షిణాఫ్రికాకు చెందిన నటాలీ స్కివర్ 752 పాయింట్లో 2వ స్థానంలో , ఆసిస్ కు చెందిన బెత్ మూనీ 749 పాయింట్లతో మూడో ప్లేస్ లో నిలిచింది.
వరుసగా 714 పాయింట్లతో లారా వోల్వార్ట్ , 710 పాయింట్లో కీవీస్ కు చెందిన మెగ్ లావింగ్ , 713 పాయింట్లతో విండీస్ కు చెందిన రాచెల్ హేన్స్ నిలిచారు.
7వ స్థానంలో ఆసిస్ కు చెందిన అమీ సాటర్త్ వైట్ , 8వ స్థానంలో చమరి అటపట్టు , 9వ స్థానంలో స్మృతి మంధాన, 10వ స్థానంలో ఎల్లీస్ పెర్రీ ఉన్నారు.
Also Read : చెలరేగిన ఇండియా చేతులెత్తేసిన ఇంగ్లండ్