Nandamuri Ramakrishna : తార‌క‌ర‌త్న కోలుకుంటున్నారు

ఆరోగ్య ప‌రిస్థితిపై కీల‌క అప్ డేట్

Nandamuri Ramakrishna : నారా లోకేష్ చేప‌ట్టిన యువ గ‌ళం పాద‌యాత్ర‌లో సొమ్మ సిల్లి ప‌డి పోయిన తార‌కర‌త్న ప్ర‌స్తుతం అప‌స్మార‌క స్థితిలో చికిత్స పొందుతున్నారు. మొద‌ట కుప్పంలో చికిత్స అందించిన అనంత‌రం మెరుగైన చికిత్స కోసం బెంగ‌ళూరులోని నారాయ‌ణ హృద‌యాల‌య‌కు త‌ర‌లించారు. అక్క‌డ‌నే కంటిన్యూ అవుతోంది చికిత్స‌. న‌టుడు నంద‌మూరి బాల‌కృష్ణ తో పాటు కుటుంబీకులంతా ఆస్ప‌త్రిలోనే ఉన్నారు.

మ‌రో వైపు క‌ళ్యాణ్ రామ్ , జూనియ‌ర్ ఎన్టీఆర్ సైతం ప‌రామ‌ర్శించారు. రాష్ట్ర ప్ర‌భుత్వం పూర్తిగా వ‌స‌తి సౌక‌ర్యాలు క‌ల్పించాల‌ని ఆదేశించింది. దివంగ‌త న‌టుడు పునీత్ రాజ్ కుమార్ సోద‌రుడు పునీత్ శివ‌రాజ్ కుమార్ సైతం ఆస్ప‌త్రిని సంద‌ర్శించారు. తార‌క‌ర‌త్న ఆరోగ్యంపై ఆరా తీశారు.

ఆయ‌న బాల‌కృష్ణ‌తో మాట్లాడారు. తాజాగా సోమవారం తార‌క‌ర‌త్న ఆరోగ్య ప‌రిస్థితిపై ఫుల్ క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు నంద‌మూరి రామ‌కృష్ణ‌. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఇప్ప‌టి వ‌ర‌కు రెండు సార్లు బ్రెయిన్ , గుండెకు సంబంధించిన చికిత్స‌లు చేశార‌ని తెలిపారు.

ఈ రిపోర్టులు వ‌చ్చాక హెల్త్ కండీష‌న్ ఎలా ఉంద‌నే దానిపై కొంత అవ‌గాహ‌న వ‌స్తుంద‌న్నారు. తార‌క‌ర‌త్న ఆరోగ్య ప‌రిస్థితి మ‌రింత మెరుగు ప‌డింద‌న్నారు. త‌న‌కు తానుగా శ్వాస తీసుకుంటున్నార‌ని , అవ‌య‌వాలు అన్నీ బాగానే ఉన్నాయ‌ని చెప్పారు. అయితే బాల‌కృష్ణ తార‌కర‌త్న‌ను ద‌గ్గ‌రుండి చూసుకుంటున్నార‌ని , ఎక్మో ద్వారా చికిత్స చేస్తున్నార‌న‌డం అబ‌ద్ద‌మ‌న్నారు.

ప్ర‌స్తుతం త‌మ కుటుంబీకులంతా నారాయ‌ణ హృద‌యాల‌య ఆస్ప‌త్రిలోనే ఉన్నార‌ని స్ప‌ష్టం చేశారు నంద‌మూరి రామ‌కృష్ణ‌(Nandamuri Ramakrishna). తార‌క‌ర‌త్న త్వ‌ర‌గా కోలుకోవాల‌ని నంద‌మూరి ఫ్యాన్స్ ప్రార్థిస్తున్నారు.

Also Read : తారక‌ర‌త్న ఆరోగ్యంపై బాబు ఆరా

Leave A Reply

Your Email Id will not be published!