Felicitation for Padma Awards Winners: పద్మ అవార్డు గ్రహీతలకు తెలంగాణా సర్కార్ సన్మానం !

పద్మ అవార్డు గ్రహీతలకు తెలంగాణా సర్కార్ సన్మానం !

Felicitation for Padma Awards Winners: 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగు వారిని తెలంగాణ ప్రభుత్వ ఘనంగా సత్కరించింది. హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి(Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావులతో పాటు తెలుగు రాష్ట్రాల పద్మ అవార్డుల గ్రహీతలు పాల్గొన్నారు. వీరిలో పద్మవిభూషణ్ పురస్కారాలకు ఎంపికైన మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, సినీనటుడు మెగాస్టార్ చిరంజీవితో పాటు పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన గడ్డం సమ్మయ్య, దాసరి కొండప్ప, ఆనందాచారి, ఉమామహేశ్వరి, కేతావత్‌ సోమ్‌లాల్‌, కూరెళ్ల విఠలాచార్య ఉన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి… పద్మ అవార్డు గ్రహీతలను పుష్ప గుచ్ఛం ఇచ్చి శాలువాతో సత్కరించారు.

Felicitation for Padma Awards Winners Update

ఇది ఇలా ఉండగా మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్‌ అవార్డు ప్రకటించిన సందర్భంగా… మెగా కోడలు ఉపాసన శనివారం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విందులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… మెగాస్టార్ చిరంజీవికి అవార్డు రావడం మనందరికీ గర్వకారణమని అన్నారు.

Also Read : Telangana MP : ఆ ఒక్క ఎంపీ స్థానం వైపు మూడు పార్టీల నాయకుల చూపు

Leave A Reply

Your Email Id will not be published!