Telangana Elections : జనవరి 28న ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు పోలింగ్
ఇక తెలంగాణలో ఎన్నికల జోరు నడుస్తూనే ఉంది
Telangana Elections : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసి నెల రోజుల కాకుండానే మళ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. అయితే లోక్ సభ ఎన్నికలు రానున్న క్రమంలో లోక్ సభ ఎన్నికలకు రంగం సిద్ధం చేశారని అందరూ భావిస్తున్నారు. తెలంగాణ(Telangana) శాసనమండలిలోని రెండు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. రెండు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి పార్లమెంటరీ సెక్రటేరియట్ పలు నోటిఫికేషన్లను విడుదల చేసింది. నేటి (జనవరి 11) నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
Telangana Elections Update
జనవరి 11 నుంచి 18 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అభ్యర్థులను జనవరి 19న పరిశీలిస్తారు. 22వ తేదీ వరకు నామినేషన్ ఉప సంహరణకు గడువు విధించారు. జనవరి 29న ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్లను లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.
ఇ ఉప ఎన్నికలు విడివిడిగా కావడంతో అధికార కాంగ్రెస్కు రెండు ఎమ్మెల్యే స్థానాలు దక్కనున్నాయి. అయితే ఈ ఎమ్మెల్సీ పదవి కోసం జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు పోటీపడుతున్నట్లు తెలుస్తోంది. కానీ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్సీలుగా ఉన్న కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి నిన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిచారు. వారు ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయడంతో ఈ రెండు స్థానాలకు ఎన్నికల సంఘం ఉప ఎన్నికలు నిర్వహిస్తోంది.
Also Read : PM Modi : మహిళా రైతులకు ప్రధానమంత్రి ఖుష్ కబుర్