Telangana Govt : ఇకపై రేషన్ షాపుల్లో 3 నెలల సన్న బియ్యం ఒకేసారి పంపిణీ

ఈ మేరకు అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు...

Telangana Govt : ప్రభుత్వం రేషన్‌ షాపుల ద్వారా పంపిణీ చేసే సన్న బియ్యం ఈసారి మూడు నెలలకు కలిపి ఒకే నెలలో ఇవ్వనున్నారు. ఈ మేరకు సివిల్‌ సప్లయిస్‌ విభాగం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. బాలాపూర్‌ మండలంలోని షాపులన్నింటికీ బి య్యం సరఫరా కూడా జరిగింది. గతంలో ఏ నెలకానెల బియ్యం పంపిణీ జరిగేది. అయితే ఈ సారి మాత్రం ఒకే నెలలో జూన్‌, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన సన్న బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Telangana Govt…

ఈ మేరకు అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. జూన్‌ నెలలోని అన్ని రోజుల్లో రేషన్‌ షాపులు తెరిచి ఉంచుతారు. ప్రతి రోజు ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు, తిరిగి సాయంత్రం 4గంటల నుంచి రాత్రి 8గంటల వరకు రేషన్‌ షాపులు పని చేయనున్నాయి. బాలాపూర్‌ మండలంలోని అన్ని గ్రామాలకు సంబంధించిన రేషన్‌ బియ్యం షాపులకు వచ్చిందని.

బియ్యం అందుబాటులో ఉంచి వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా పంపిణీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని మండల రేషన్‌ డీలర్ల సంఘం అధ్యక్షుడు టేకుల శశిధర్‌రెడ్డి చెప్పారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. తిరిగి సెప్టెంబరులో సన్న బియ్యం పంపిణీ ఉంటుందని ఆయన చెప్పారు.

Also Read : Weather Report : తెలుగు రాష్ట్రాల్లో ఆయా ప్రాంతాలకు ఎడతెరిపిలేని వర్షాలు

Leave A Reply

Your Email Id will not be published!