Telangana Speaker : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎక్స్ ఖాతాను హ్యాక్ చేసిన కేటుగాళ్లు

ఆ సమయంలో కేటుగాళ్లు కొన్ని అసభ్యకర వీడియోలు పోస్టు చేశారు...

Telangana Speaker : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు భారీ షాక్ తగిలింది. ఇవాళ(సోమవారం) ఉదయం ఆయన ఎక్స్ ఖాతాను కేటుగాళ్లు హ్యాక్ చేశారు. ఆ సమయంలో కొన్ని అసభ్యకర వీడియోలను పోస్టు చేశారు. అకౌంట్ రికవరీ తర్వాత స్పీకర్ ప్రసాద్ కుమార్ ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు.

Telangana Speaker Twitter Account

ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ..” ఇవాళ ఉదయం నా వ్యక్తిగత అకౌంట్ కొంత సమయం హ్యాక్ అయ్యింది. ఆ సమయంలో కేటుగాళ్లు కొన్ని అసభ్యకర వీడియోలు పోస్టు చేశారు. మా టెక్నికల్ టీమ్ ఈ విషయాన్ని గమనించి వెంటనే తగిన చర్యలు తీసుకున్నారు. వెంటనే ఖాతాను తిరిగి రికవరీ చేశారు. హ్యాక్ చేసిన సమయంలో దుండగులు అసభ్యకర పోస్టులు, వీడియోలు పెట్టారు. వాటితో నాకు ఎలాంటి సంబంధం లేదు” అని తెలిపారు.

Also Read : Home Minister Anitha : సినర్జీస్ కంపెనీ బాధితుల నష్టపరిహారంపై కీలక వ్యాఖ్యలు చేసిన హోమ్ మంత్రి

Leave A Reply

Your Email Id will not be published!