TGSRTC : ఆర్టీసీ ప్రయాణికులకు భారీ షాక్ ఇచ్చిన తెలంగాణ ఆర్టీసీ
ఈ ఛార్జీల పెంపుతో నగరవాసులపై అదనపు భారం పడనుంది...
TGSRTC : ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ బిగ్ షాక్ ఇచ్చింది. బస్ పాస్ ఛార్జీలను పెంచింది. బస్ పాస్ ఛార్జీలను 20 శాతం మేర పెంచుతూ టీజీఎస్ఆర్టీసీ(TGSRTC) సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణ ప్రజలతోపాటు స్టూడెంట్ పాస్ ధరలను సైతం పెంచింది. ప్రస్తుతం ఆర్డినరీ బస్ పాస్ నెలకు రూ.1,150 ఉండగా.. దానిని రూ. 1,400కు పెంచింది. అలాగే మెట్రో ఎక్స్ప్రెస్ బస్ పాస్ ధర ప్రస్తుతం రూ.1,300 ఉండగా.. ఆ ధరను రూ.1,600కు పెంచింది. ఇక మెట్రో డీలక్స్ పాస్ రూ.1,450 ఉండగా.. ఆ ధరను రూ.1,800కు పెంచింది. అలాగే గ్రేటర్ హైదరాబాద్, గ్రీన్ మెట్రో ఏసీ బస్ పాస్ ధరలనూ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కొత్త బస్ పాస్ ధరలు ఈరోజు నుంచే అమల్లోకి వస్తాయని టీజీఎస్ ఆర్టీసీ స్పష్టం చేసింది.
TGSRTC Shocking
ఈ ఛార్జీల పెంపుతో నగరవాసులపై అదనపు భారం పడనుంది. మరోవైపు రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రభుత్వం మహిళల కోసం మహాలక్ష్మి పేరుతో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. ఈ పథకం అమలుతో ఆర్టీసీ తీవ్ర నష్టాల బాటలో నడుస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొందని మండిపడుతున్నారు. మరోవైపు తమ జీతభత్యాలు పెంచాలంటూ ఆర్టీసీ కార్మికులు గత నెలలో సమ్మెకు పిలుపునిచ్చిన విషయం విదితమే. అయితే ఆర్టీసీ కార్మిక నేతలతో ప్రభుత్వం చర్చలు జరిపింది. దీంతో ఈ సమ్మెను ఆర్టీసీ కార్మికులు తాత్కాలికంగా వాయిదా వేశారు.
ఇక అదే సమయంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె పిలుపుపై సీఎం రేవంత్ రెడ్డి ఓ కార్యక్రమం వేదికగా స్పందించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.లక్షల కోట్ల అప్పులు చేసిందని విమర్శించారు. ఆ అప్పులకు వడ్డీలు చెల్లించడంతోనే తమ ప్రభుత్వానికి వస్తున్న ఆదాయంలో కొంత భాగం వెళ్లిపోతుందన్నారు. అలాంటి వేళ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగితే.. పరిస్థితి మరింత కష్టంగా మారుతోందని సీఎం స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సమ్మెపై పునరాలోచన చేసుకోవాలంటూ ఆర్టీసీ కార్మిక నేతలకు సూచించారు. అలాంటి వేళ.. ప్రభుత్వంతో జరిగిన సమావేశంలో ఏకాభిప్రాయానికి వచ్చిన ఆర్టీసీ కార్మిక నేతలు ఈ సమ్మెను వాయిదా వేసిన సంగతి తెలిసిందే.
Also Read : PSR Anjaneyulu-High Court : సీనియర్ ఐపీఎస్ పీఎస్ఆర్ కు భారీ షాక్ ఇచ్చిన హైకోర్టు